విశ్వ కర్మ పురస్కారానికి ‘ఏలూరి’ ఎంపిక | - | Sakshi
Sakshi News home page

విశ్వ కర్మ పురస్కారానికి ‘ఏలూరి’ ఎంపిక

Sep 5 2025 5:40 AM | Updated on Sep 5 2025 5:42 AM

విశ్వ కర్మ పురస్కారానికి ‘ఏలూరి’ ఎంపిక జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఇద్దరు ఎంపిక భిక్షాటనకు వచ్చి నగదు చోరీ అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు కరెంట్‌ షాక్‌తో యువ కౌలు రైతు మృతి

అద్దంకి: పట్టణానికి చెందిన ఏలూరి వీరబ్ర హ్మాచారి విశ్వకర్మ జాతీ య కళారత్న పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ మేరకు శ్రీవిరాట్‌ విశ్వకర్మ విజ్ఞాన ఆధునిక జాతీయ సాహిహిత్య సాంస్కృతిక సంస్థ తెలుగు ఇండిియన్‌ కల్చరర్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ సంస్థ సంయుక్తాధ్వర్యంలో అవార్డులను ప్రకటించారు. పట్టణానికి చెందిన దారు శిల్పి(చెక్క బొమ్మలు) రంగంలో ప్రతిభ చూపుతున్న ఏలూరి వీరబ్రహ్మాచారిని ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. ఈ పురస్కారాన్ని ఆయన ఈ నెల 14న తెలంగాణాలోని రాజ్యలక్ష్మి కన్వెక్షన్‌ హాలులో నిర్వహించనున్న ఆవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో అందుకోనున్నారు.

చినగంజాం: జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా చినగంజాం మండలానికి చెందిన ఇరువురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. రాజుబంగారుపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఇంగ్లిషు స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రావిపాటి శివ వెంకట పోతురాజు, ఆవులదొడ్డి గొల్లపాలెంలోని పాఠశాలలో తెలుగు స్కూల్‌ అసిస్టెంట్‌ ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న కడలి సుజాతలు ఎంపికయ్యారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం కలెక్టర్‌, జిల్లా విద్యాశాఖాధికారి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు.

కోడూరు: స్వామిజీల వేషధారణలో భిక్షాటనకు వచ్చిన నలుగురు వ్యక్తులు ఓ ఇంట్లో చోరీకి పాడ్డారు. వారిని కోడూరు పోలీసులు గురువారం చాకచక్యంగా అరెస్టు చేశారు. ఎస్‌ఐ చాణక్య కథనం మేరకు.. మండలంలోని లింగారెడ్డిపాలెం గ్రామానికి చెందిన బచ్చు వెంకట పున్నయ్య ఇంటికి నలుగురు వ్యక్తులు గురువారం స్వామిజీల వేషధారణ భిక్షాటనకు వచ్చారు. పున్నయ్య వరండాలో టేబుల్‌పై రూ.11 వేలు ఉంచి ఇంట్లోకి వెళ్లాడు. అదే సమయంలో భిక్షాటనకు వచ్చిన నలుగురు దొంగ స్వాములు ఆ రూ.11 వేల నగదును దొంగలించి అక్కడి నుంచి పరారయ్యారు. నగదు పోయిన విషయాన్ని గ్రహించిన పున్నయ్య వెంటనే కోడూరు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా బాపట్ల జిల్లా నగరం గ్రామానికి చెందిన గంధం శివయ్య, గంధం తోట స్వామిజీ, పాసం బాజీ, పాసం యేసును నిందితులుగా గుర్తించి అరెస్టు చేశారు.

రేపల్లె: రేపల్లె ఏబీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలో అతిథి అధ్యాపకుల నియమకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ టీసీ రవిచంద్ర కుమా ర్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కామ ర్స్‌, జంతుశాస్త్రం, కంప్యూటరు సైన్స్‌ విభాగాల్లో ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. సంబంధిత సబ్జెక్టు పీజీలో 55 శాతం మార్కులు కలిగి ఉన్న వారు దరఖాస్తులు చేసుకునేందుకు అర్హులన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉండాలన్నారు. నెట్‌, సెట్‌, పీహెచ్‌డీ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 10వ తేదీన ఉదయం 11 గంటలకు ఒరిజినల్‌ సర్టిఫికేట్‌లతో కళాశాలలో జరిగే ఇంటర్వ్యూకి హాజరు కావాలన్నారు.

భట్టిప్రోలు(వేమూరు): కరెంట్‌ షాక్‌ వల్ల యువ కౌలు రైతు మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. భట్టిప్రోలు మండలంలోని గుత్తావారి పాలెం గ్రామానికి చెందిన వాకా శరత్‌(26) గురువారం ఉదయం పొలంలో నీరు పెట్టేందుకు కరెంట్‌ మోటారు వేశాడు. కొద్దిసేపు తర్వాత ఇనుప గొట్టంపై చెయ్యి పెట్టి మంచినీళ్లు తాగుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్‌ షాక్‌ కొట్టడంతో పెద్దగా కేక వేసి కింద పడిపోయాడు. పక్క పొలంలో పని చేస్తున్న రైతులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో, వారు తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు చేయగా మృతి చెందాడని తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్‌ఐ శివయ్య తెలిపారు.

కడలి సుజాత

రావిపాటి పోతురాజు

విశ్వ కర్మ పురస్కారానికి ‘ఏలూరి’ ఎంపిక 1
1/3

విశ్వ కర్మ పురస్కారానికి ‘ఏలూరి’ ఎంపిక

విశ్వ కర్మ పురస్కారానికి ‘ఏలూరి’ ఎంపిక 2
2/3

విశ్వ కర్మ పురస్కారానికి ‘ఏలూరి’ ఎంపిక

విశ్వ కర్మ పురస్కారానికి ‘ఏలూరి’ ఎంపిక 3
3/3

విశ్వ కర్మ పురస్కారానికి ‘ఏలూరి’ ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement