ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నిక

Aug 4 2025 3:33 AM | Updated on Aug 4 2025 3:33 AM

ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నిక

ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నిక

నరసరావుపేట ఈస్ట్‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రధానోపాధ్యాయుల సంఘం పల్నాడు జిల్లా శాఖ అధ్యక్షుడిగా రామిశెట్టి గోవిందరాజులు (జెడ్పీ హైస్కూల్‌, కాకాని), ప్రధాన కార్యదర్శిగా రెడ్డి శ్రీనివాసరెడ్డి (జెడ్పీ హైస్కూల్‌, వెన్నాదేవి), కోశాధికారిగా పులిపాటి శ్రీనివాసరావు (జెడ్పీ హైస్కూల్‌, తూబాడు) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘం సర్వసభ్య సమావేశం, సంఘం పల్నాడు జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికను ఆదివారం ప్రకాష్‌నగర్‌లోని శ్రీతిలక్‌ మున్సిపల్‌ హైస్కూల్‌లో నిర్వహించారు. సంఘం గౌరవాధ్యక్షునిగా కొండా శ్రీనివాసరావు (సంతగుడిపాడు), రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులుగా బి.ఎం.సుభాని (రొంపిచర్ల), ఏ.శ్రీనివాసరెడ్డి (75 తాళ్లూరు), ఎస్‌.విజయలక్ష్మి (కోటప్పకొండ), జిల్లా ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా ఎం.రామారావు (బొగ్గరం), జిల్లా కేంద్రం సెక్రటరీగా వై.హనుమంతరావు (గోగులపాడు), మీడియా ప్రతినిధిగా వి.వెంకటరావు (సాతులూరు) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా సంఘం గుంటూరుజిల్లా అధ్యక్షుడు జి.శ్రీనివాసరావు, పరిశీలకునిగా రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు జి.శ్రీనివాసరావు వ్యవహరించారు. నూతన అధ్యక్ష, కార్య దర్శులు గోవిందరాజులు, శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర నాయకత్వం, సంఘం సభ్యుల సహకారంతో ప్రధానోపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement