భక్తులతో కిటకిటలాడిన బోయకొండ
చౌడేపల్లె: ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరజిల్లుతున్న బోయకొండ గంగమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. గంగమ్మా.. ఆశీర్వదించమ్మా అంటూ పూజలు చేశారు. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం తరలి వచ్చారు. అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి దర్శనభాగ్యం కల్పించారు. కోర్కెలు తీరిన భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు. ఆలయ ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో సిబ్బంది ఉచిత ప్రసాదాలను పంపిణీ చేశారు. పోలీసులు ఎలాంటి అవాంఛనీయసంఘటనలు జరగకుండా చర్యలు తీసుకొన్నారు.
భక్తులతో కిటకిటలాడిన బోయకొండ


