వైభవంగా సీతారాముల పౌర్ణమి కల్యాణం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా సీతారాముల పౌర్ణమి కల్యాణం

Oct 8 2025 10:00 AM | Updated on Oct 8 2025 10:00 AM

వైభవం

వైభవంగా సీతారాముల పౌర్ణమి కల్యాణం

కల్యాణాన్ని వీక్షిస్తున్న భక్తులు సీతారాముల కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

ఒంటిమిట్ట : ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో సోమవారం పౌర్ణమి సందర్భంగా ఉదయం 10 గంటలకు సీతాసమేతుడైన శ్రీ కోదండ రాముడి కల్యాణం వైభవంగా నిర్వహంచారు. ఈ సందర్భంగా ఆలయంలోని కల్యాణ వేదిక వద్ద అర్చకులు ఉత్సవమూర్తులను వేర్వేరుగా ఉంచారు. అనంతరం సీతారాములకు సుగంధద్రవ్యాలతోపాటు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీళ్లతో అభిషేకాలు నిర్వహించారు. నూతన పట్టువస్త్రాలు ధరింపజేసి, తులసి గజమాలతో ప్రత్యేకంగా అలంకరించారు. తరువాత సతీసమేతుడైన శ్రీ కోదండ రామస్వామికి ఆలయ అర్చకులు అంగరంగ వైభవంగా పౌర్ణమి కల్యాణం నిర్వహించారు. స్వామి వారి కల్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

వైభవంగా సీతారాముల పౌర్ణమి కల్యాణం 1
1/1

వైభవంగా సీతారాముల పౌర్ణమి కల్యాణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement