జెడ్పీటీసీ ఉప ఎన్నికలో విజయంపై వెఎస్సార్సీపీ వ్యూహ రచన
నేతలకు దిశానిర్దేశం చేసినఆ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
ఒంటిమిట్టలో నాయకులతో విస్తృతంగా చర్చలు
మరోవైపు జోరుగా ప్రచారం
సాక్షి రాయచోటి: వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట ఆధ్యాత్మిక కేంద్రంలో వైఎస్సార్సీపీ జెండా ఎగుర వేసేందుకు ఆ పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దిశానిర్దేశం చేశారు. ఒకపక్క ప్రచారంతోపాటు మరోపక్క ఓటు బ్యాంకు ఉన్న నేతలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఇప్పటికే దూసుకుపోతున్న వైఎస్సార్సీపీ నేతలకు.. విజయ బావుటా ఎగురవేసేందుకు అవసరమైన వ్యూహాన్ని వివరించారు.
ప్రస్తుత రోజులతోపాటు ఎన్నికల ముందు అనుసరించాల్సిన విధానాన్ని వివరించడంతోపాటు సమష్టిగా పని చేస్తూ.. ఒక పథకం ప్రకానం ముందుకు వెళితే విజయం తథ్యమని వివరిస్తూ వచ్చారు. కార్యకర్తలు, నాయకులు, నేతలు, శ్రేణులు ఒంటిమిట్ట వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బా రెడ్డిని గెలిపించి వైఎస్సార్సీపీ జెండా ఎగురవేయా లని సూచించారు. ఒంటిమిట్టలో జెడ్పీటీసీ అభ్యర్థి సుబ్బారెడ్డి అతిథి గృహం వద్ద రాష్ట్ర రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతలతో చర్చించడంతోపాటు సమీక్షించి విజయానికి వ్యూహం రచించారు.
అన్ని వర్గాల ఓట్లపై దృష్టి
వైఎస్సార్ సీపీ నేతలకు రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దిశానిర్దేశం చేశారు. ఎన్నికలకు సంబంధించి పోలింగ్ రోజున అనుసరించాల్సిన వ్యూహాలతోపాటు ఇతర అనేక అంశాలపై చర్చించారు. రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డి, చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథరెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధ, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, రాజంపేట, కడప మేయర్ కొత్తమద్ది సురేష్బాబు, కొండూరు అజయ్రెడ్డి, జెడ్పీ చైర్మన్ రామగోవిందరెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి తదితరులతో పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించారు. జెడ్పీటీసీ అభ్యర్థి విజయమే లక్ష్యంగా పని చేస్తూ అన్ని వర్గాల ఓట్లు వైఎస్సార్సీపీకి లభించేలా కార్యాచరణ అమలు చేయాలని సూచించారు.
వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డికి మద్దతుగా పెద్ద ఎత్తున నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. గురువారం రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి, వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, కడప మేయర్ సురేష్ బాబు, కడప పార్లమెంటు పరిశీలకులు కొండూరు అజయ్రెడ్డి, జెడ్పీ చైర్మన్ రామగోవిందరెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధ, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, పద్మశాలీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ జింకా విజయలక్ష్మి, జిల్లా యువజన విభాగపు అధ్యక్షుడు శివప్రసాద్రెడ్డి, వీరబల్లి ఎంపీపీ గాలివీటి రాజేంద్రనాథరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఏకుల రాజేశ్వరి, రాష్ట్ర మైనార్టీ నాయకులు షఫి ఇలియాజ్, మాజీ కార్పొరేటర్లు శ్రీరంజన్, జయచంద్రారెడ్డిలతోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు. కొత్తమాధవరంలోని పెద్దరోడ్డు వీధి, స్టేట్ బ్యాంక్ వీధి, భద్రావతి, భావ నారాయణస్వామి ఆలయ పరిసర ఆలయం వీధితోపాటు అన్ని వీధులలో కలియ తిరిగారు. అలాగే గురువారం సాయంత్రం సాలాబాద్లో మైదుకూరు మాజీ ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి, పెద్ద పేరూరు, తప్పెటవారిపల్లెల్లో ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధలు ప్రచారం నిర్వహించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికలలో భాగంగా అన్ని స్థానాలలో వైఎస్సార్సీపీ విజయ దుందుభి మోగిస్తుందని, అలాగే ఒంటిమిట్ట, పులివెందులలో కూడా విజయం తథ్యమని పార్టీ కీలక నేతలు పేర్కొన్నారు. అందుకు సంబంధించి గురువారం ఒంటిమిట్ట మండలంలోని మాధవరం, ఇతర గ్రామాల్లో ప్రచారం సందర్భంగా పలువురు మాట్లాడుతూ టీడీపీ, పోలీసులు ఎన్ని ఆరాచకాలకు తెరతీసినా చివరకు వైఎస్సార్సీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు. ధర్మ పోరాటంలో విజయం వైఎస్సార్సీపీ పక్షాన ఉంటుందని వివరించారు. వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పలువురు కోరారు.
కుడుమలూరు గ్రామంలో జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డితో కలిసి వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ కడప జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథరెడ్డి ప్రచారం నిర్వహించారు.

విజయం తథ్యం

ముమ్మరంగా ప్రచారం