మహిళ కడుపులో 3 కిలోల కణితి తొలగింపు | - | Sakshi
Sakshi News home page

మహిళ కడుపులో 3 కిలోల కణితి తొలగింపు

Jul 29 2025 7:30 AM | Updated on Jul 29 2025 8:38 AM

మహిళ కడుపులో 3 కిలోల కణితి తొలగింపు

మహిళ కడుపులో 3 కిలోల కణితి తొలగింపు

రాయచోటి టౌన్‌ : రాయచోటి మండల పరిధిలోని యండపల్లెకు చెందిన అంజనమ్మ అనే మహిళ కడుపులో నుంచి 3 కిలోల బరువున్న కణితిని రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల బృందం తొలగించింది. సోమవారం అంజనమ్మకు డాక్టర్‌ లక్ష్మిప్రసాద్‌తో పాటు మరికొంతమంది వైద్యుల బృందం శస్త్ర చికిత్స చేసి ఈ కణితిని తొలగించారు. ఈమె గత పదేళ్లుగా కడుపు నొప్పితో బాధపడుతూ వివిధ ప్రాంతాల్లో వైద్యం చేయించుకుంది. అయినా ప్రయోజనం లేదు. ఈ క్రమంలో సోమవారం రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి వైద్యులు ఆమె కడుపులోని కణితిని తొలగించి ఉపశమనం కలిగించారు.

స్కూటీ అదుపుతప్పి మహిళకు గాయాలు

మదనపల్లె రూరల్‌ : సీటీఎం పంచాయతీ నేతాజీ కాలనీకి చెందిన సురేఖ (33) ఆదివారం రాత్రి సొంతపనులపై మదనపల్లెకు వచ్చి తిరిగి ఇంటికి వెళుతుండగా కొత్తవారిపల్లె వద్ద స్కూటీ అదుపుతప్పి కిందపడి తీవ్రంగా గాయపడింది. స్థానికులు బాధితురాలిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తీసుకెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement