కాకినాడ రూరల్: గోదావరి డెల్టా ఆయకట్టుకు ఈ నెల 15 నుంచి కాలువల ద్వారా నీరు విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. జలవనరులశాఖ మంత్రి సమక్షంలో ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు, అధికారులు, రైతులతో చర్చించి నీటి విడుదలపై ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని తెలిపారు. రైతులు నష్టపోకుండా తొలిసారిగా పంటల ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. మార్కెట్లో గిరాకీ ఉన్న వరి వంగడాలనే వచ్చే ఖరీఫ్లో పండించాలని రైతులకు సూచించారు. ఆయన ఆదివారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని తన క్యాంపు కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. రైతులు, వినియోగదారులకు ప్రయోజనం చేకూరేలా విశాఖపట్నంలో మూడు, తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ తూరంగి, జగన్నాథపురం వద్ద కొత్తగా రైతుబజార్లు మంజూరు చేశామని చెప్పారు. మార్కెట్ సౌకర్యాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారన్నారు.
రూ.212 కోట్లతో మార్కెట్ యార్డుల అభివృద్ధి
వ్యవసాయ మార్కెట్ యార్డుల ఆధునికీకరణకు నాడు–నేడు పథకం ద్వారా శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. తొలిదశలో రూ.212 కోట్లతో మార్కెట్ యార్డులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. రబీలో 24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. సీఎం జగన్ ఆదేశాలకు అనుగుణంగా కొనుగోలు చేసిన ధాన్యానికి 21 రోజుల్లో రైతు ఖాతాకు సొమ్ము జమచేస్తున్నామన్నారు. రైతు భరోసా కేంద్రాలను కొనుగోలు కేంద్రాలుగా మార్చి, అక్కడ పేరు నమోదు చేసుకున్న రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలో బొండాలు రకం ధాన్యాన్ని మిల్లర్లు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నట్టు తెలియడంతో సీఎం ఆదేశాల మేరకు కనీస మద్దతు ధర అమలయ్యేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
15 నుంచి గోదావరి డెల్టాకు నీరు
Published Mon, Jun 7 2021 4:32 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement