సంద్రం ఒడిలోకి తాబేళ్ల పిల్లలు 

Turtle Babies In Care Of Tree Foundation - Sakshi

ఇచ్ఛాపురం రూరల్‌: సముద్ర తాబేళ్లను రక్షించుకునే బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని బూర్జపాడు సర్పంచ్‌ బుడ్డ మోహనాంగి అన్నారు. డొంకూరు మత్స్యకార గ్రామంలో ట్రీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో స్థానిక తీరం ఒడ్డున కొంత కాలంగా తాబేళ్ల గుడ్లను సేకరిస్తూ పిల్లలు పొదిగేంత వరకు వాటిని సంరక్షిస్తూ సముద్రంలో విడిచిపెడుతుండేవారు.

శుక్రవారం రాత్రి సుమారు 300 తాబేళ్ల పిల్లలను ఆమె విడిచిపెట్టారు. వైఎస్సార్‌సీపీ నాయకుడు బుడ్డ కాంతారావు, మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు చీకటి గురుమూర్తి, ట్రీ ఫౌండేషన్‌ సంరక్షకులు పాల్గొన్నారు.

చదవండి:
కాళ్లు చేతులు కదలవు.. కానీ డ్యాన్స్‌ మాత్రం..   
ఫలరాజు.. ఎగుమతుల్లో రారాజు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top