వల్లూరు: వైఎస్సార్జిల్లా వల్లూరు మండలం పుష్పగిరి పెన్నా నదిలో ముగ్గురు యువకులు స్నానానికి దిగి గల్లంతయ్యారు. ఈ ఘటనలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి.
ఈ ఘటనలో గల్లంతైన వారిలో కడప టౌన్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన హర్షవర్ధన్ (22), కడప విశ్వనాధ పురానికి చెందిన హరిబాబు (25), కడప ఐటి సర్కిల్ కు చెందిన కృష్ణ చైతన్య (20) లుగా గుర్తించారు. గల్లంతైన వారిలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. హరిబాబు, హర్షవర్ధన్ల మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగిలిన యువకుని మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


