జనం కోసం అమ్మ ఒడి డబ్బు ఖర్చు | Social worker spent Jagananna Amma Vodi Money for people | Sakshi
Sakshi News home page

జనం కోసం అమ్మ ఒడి డబ్బు ఖర్చు

Jun 29 2022 3:39 AM | Updated on Jun 29 2022 8:08 AM

Social worker spent Jagananna Amma Vodi Money for people - Sakshi

రోడ్డు పనులు చేస్తున్న జాకబ్‌

వెదురుకుప్పం: తల్లిదండ్రుల కమిటీ మాజీ చైర్మన్‌ తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. ప్రజోపకరమైన పనులు చేస్తోన్న ఆ సామాజిక కార్యకర్త ఈ సారి జగనన్న అమ్మ ఒడి డబ్బులతో శ్మశానానికి రోడ్డు వేసేందుకు సంకల్పించాడు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలోని బలిమొండివెంగనపల్లె గ్రామానికి చెందిన కొత్తపల్లె జాకబ్‌ కుమార్తె వర్షిత స్థానిక ప్రాథమికోన్నత పాఠశాలలో 5 పూర్తి చేసింది.

ఇదే పాఠశాలకు జాకబ్‌ చైర్మన్‌గా వ్యవహరించారు. వర్షితకు జగనన్న అమ్మ ఒడి పథకం కింద రూ.13 వేలు తల్లి సుకన్య ఖాతాలో జమ అయ్యింది. బలిజమొండివెంగనపల్లె దళితవాడ నుంచి శ్మశాన వాటికకు వెళ్లేందుకు దారి సక్రమంగా లేకపోవడాన్ని గుర్తించిన జాకబ్‌ తన భార్యకు వచ్చిన అమ్మ ఒడి సొమ్ముతో మంగళవారం జేసీబీ సాయంతో రహదారిని మరమ్మతు చేయించాడు. జాకబ్‌ మాట్లాడుతూ..చెప్పిన మాటకు కట్టుబడి పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement