రూ.కోటి విరాళం.. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడు కోసం..
సాక్షి, అమరావతి: మనబడి నాడు–నేడు పథకంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాల కల్పన నిమిత్తం కనెక్ట్ టు ఆంధ్ర ద్వారా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) ఫండ్ కింద పోకర్ణ గ్రూప్ రూ.కోటి విరాళంగా ఇచ్చింది. విరాళానికి సంబంధించిన చెక్కును క్యాంప్ కార్యాలయంలో మంగళవారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి పోకర్ణ గ్రూప్ సీఎండీ గౌతమ్చంద్ జైన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కనెక్ట్ టు ఆంధ్ర సీఈవో వి.కోటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు