ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం | MLA Nimmala Ramanaidu saved by SDRF | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం

Aug 19 2020 8:45 PM | Updated on Aug 19 2020 9:23 PM

MLA Nimmala Ramanaidu saved by SDRF - Sakshi

సాక్షి, ప.గో(యలమంచిలి): ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న పడవ ఇంజిన్ పాడైపోవడంతో వరద ఉధృతికి కొట్టుకుపోయింది. యలమంచిలి మండలం బాడవ వరద ప్రాంతం నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. తూర్పు గోదావరి వైపు చెట్టుకు లంగర్ వేసి పడవను ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బంది అదుపు చేసింది.

ఎమ్మెల్యే ముంపు గ్రామాలకు వెళ్లేటప్పుడు తమకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని డీఎస్పీ నాగేశ్వరరావు అన్నారు. సమాచారం ఇచ్చిన వెంటనే ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బందితో కాపాడగలిగామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement