కర్నూలు బస్సు ప్రమాదం.. రమేష్‌ కుటుంబాన్ని వెంటాడుతున్న ప్రమాదాలు | Kurnool Bus Accident: Ramesh Family Haunted by Misfortunes | Sakshi
Sakshi News home page

కర్నూలు బస్సు ప్రమాదం.. రమేష్‌ కుటుంబాన్ని వెంటాడుతున్న ప్రమాదాలు

Oct 27 2025 4:29 PM | Updated on Oct 27 2025 5:20 PM

Kurnool Bus Accident: Ramesh Family Haunted by Misfortunes

సాక్షి,అమరావతి: హైదరాబాద్‌ నుంచి గురువారం రాత్రి బెంగళూరుకు బయలు దేరిన వేమూరి కావేరి ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్‌ కోచ్‌ బస్సు(డీడీ 01ఎన్‌9490) శుక్రవారం తెల్లవారు జామున కర్నూలు సమీపంలో ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసింది. అయితే ఈ ప్రమాదంలో మరణించిన గోళ్ల రమేష్‌(31) కుటుంబాన్ని ప్రమాదాలు వెంటాడుతున్నాయి.

సోమవారం కర్నూలు బస్సు ప్రమాదంలో చనిపోయిన రమేష్‌  కుటుంబసభ్యుల అంత్యక్రియల్లో పాల్గొని ఇంటికి వెళ్తుండగా వారి కుటుంబసభ్యులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.  

నెల్లూరు జిల్లా జలదంకి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో రమేష్‌ కుటుంబసభ్యుల ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. వింజమూరు (మం) గోళ్ళవారి పల్లి నుండి విజయవాడ వెళ్తుండగా కారు టైర్‌ పంచర్‌ కావడంతో కల్వర్టను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

బస్సు ప్రమాదంలో నెల్లూరుకు చెందిన కుటుంబం మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement