కర్నూలు బస్సు ప్రమాదం.. రమేష్‌ కుటుంబాన్ని వెంటాడుతున్న ప్రమాదాలు | Kurnool Bus Accident: Ramesh Family Haunted by Misfortunes | Sakshi
Sakshi News home page

కర్నూలు బస్సు ప్రమాదం.. రమేష్‌ కుటుంబాన్ని వెంటాడుతున్న ప్రమాదాలు

Oct 27 2025 4:29 PM | Updated on Oct 27 2025 5:20 PM

Kurnool Bus Accident: Ramesh Family Haunted by Misfortunes

సాక్షి,అమరావతి: హైదరాబాద్‌ నుంచి గురువారం రాత్రి బెంగళూరుకు బయలు దేరిన వేమూరి కావేరి ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్‌ కోచ్‌ బస్సు(డీడీ 01ఎన్‌9490) శుక్రవారం తెల్లవారు జామున కర్నూలు సమీపంలో ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసింది. అయితే ఈ ప్రమాదంలో మరణించిన గోళ్ల రమేష్‌(31) కుటుంబాన్ని ప్రమాదాలు వెంటాడుతున్నాయి.

సోమవారం కర్నూలు బస్సు ప్రమాదంలో చనిపోయిన రమేష్‌  కుటుంబసభ్యుల అంత్యక్రియల్లో పాల్గొని ఇంటికి వెళ్తుండగా వారి కుటుంబసభ్యులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.  

నెల్లూరు జిల్లా జలదంకి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో రమేష్‌ కుటుంబసభ్యుల ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. వింజమూరు (మం) గోళ్ళవారి పల్లి నుండి విజయవాడ వెళ్తుండగా కారు టైర్‌ పంచర్‌ కావడంతో కల్వర్టను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

బస్సు ప్రమాదంలో నెల్లూరుకు చెందిన కుటుంబం మృతి

Advertisement
 
Advertisement
Advertisement