‘సెల్‌’.. కిల్‌ యూ | Increased use of cell phones and electronic gadgets from children to adults | Sakshi
Sakshi News home page

‘సెల్‌’.. కిల్‌ యూ

Feb 23 2025 5:02 AM | Updated on Feb 23 2025 5:02 AM

Increased use of cell phones and electronic gadgets from children to adults

చిన్నారుల నుంచి పెద్దల వరకు పెరిగిన సెల్‌ ఫోన్, ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్ల వినియోగం

శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం

వీటి వినియోగానికివిరామం ఇవ్వాలనిసూచిస్తున్న వైద్యులు

ఇలా విరామం ఇవ్వడమే డిజిటల్‌ డిటాక్స్‌ విధానం

ఈ విధానంతో మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగవుతుందని వెల్లడి

సాక్షి, అమరావతి: ఇది డిజిటల్‌ యుగం. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ అందరికీ సెల్‌ ఫోన్, ల్యాప్‌ టాప్, ఇతర ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌­తోనే పని. చదు­వులైనా, ఉద్యోగ­మైనా, వ్యా­పా­ర­మైనా, వస్తువులు కొన­డానికైనా అన్నిటికీ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లే ముఖ్య సాధనాలైపో­యాయి. అయితే వీటి వినియో­గం మితిమీరి వాటికి బానిస­లుగా మారిపోతున్న వారి సంఖ్య పెరిగిపో­తోంది. వీటి అతి వినియో­గం మనిషి మాన­సిక, శారీరక ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభా­వం చూపుతోంది. 

ఎలక్ట్రా­నిక్‌ గాడ్జెట్స్‌ అతి వినియో­గాన్ని నియంత్రించకపోతే తీవ్ర పరి­ణా­మాలు తలెత్తు­తా­యని వైద్యులు హెచ్చరి­స్తు­న్నారు. ఆరోగ్యం బాగు­ండాలి.. సంతోషంగా జీవించాలి.. అని దేవుడిని ప్రార్థిస్తూ చాలా మంది ఉపవాసం పాటి­స్తుంటారు. అదేవి­ధ­ంగా శారీరక, మానసిక ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌ వినియో­గాన్ని కొన్ని గంటలు, రోజులు వదిలేసి డిజిటల్‌ డిటాక్స్‌ పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. 

డిజి­టల్‌ డిటాక్స్‌ విధానంతో మానసిక ఆరో­గ్యం, మెదడు పనితీరు మెరుగుపడుతుందని, శారీ­రక ఆరో­గ్యా­­నికి మేలు చేకూరుతుందని పరిశోధ­నలు వెల్లడి­స్తు­­న్నాయి. కెనడాలోని ఆల్బెర్టా విశ్వ­వి­ద్యాల­యం డిజి­టల్‌ డిటాక్స్‌పై అధ్యయనం చేయగా  ఆసక్తికర అంశాలు వెల్లడ­య్యా­యి. సెల్‌ఫోన్, ఇంటర్నెట్‌ను అతి­గా వినియో­గించే 467 మందిని ఈ విశ్వ­విద్యా­లయం పరిశోధ­కులు అధ్యయనం చేశారు. వీరికి రెండు వారా­ల పాటు సెల్‌ఫోన్, ఇంటర్నెట్‌ యాక్సెస్‌ లేకుండా చేశారు. 

డిజిటల్‌ డిటా­క్స్‌కు ముందు, ఆ తర్వాత వారి మానసిక ఆరోగ్యం, శ్రద్ధ, సామర్థ్యాలను అంచనా వేశా­రు. 91 శాతం మందిలో డిటాక్స్‌ అనంత­రం మెదడు పనితీరు మెరుగుపడటంతో పాటు, ఆందోళన, నిరాశ వంటి లక్షణాలు తగ్గినట్టు వెల్లడైంది. మొబైల్, ఇంటర్నెట్‌ యాక్సెస్‌ లేని వ్యక్తులు ముఖా­ముఖి సంభాషణలు, వ్యా­యా­మం, చదవడం వంటి బహిరంగ కార్యక­లా­పాలను ఆస్వాదించడంలో నిమ­గ్న­మ­య్యారు. ఈ ప్రక్రియలు మాన­సిక ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

మెదడుకు రీచార్జ్‌
భారతీయులు సగటున రోజుకు 7.3 గంటలు స్క్రీన్‌ చూడటానికి కేటాయిస్తున్నారని పలు అధ్యయనాలు వెల్లడించాయి. గంటల తరబడి స్క్రీన్‌కు సమయాన్ని కేటాయించడంతో నిద్ర లేమి, ఒత్తిడి, ఆందోళన, నిరాశ తలెత్తడంతో పాటు, ఊబకాయం, ఇతర అనారోగ్య సమ­స్యలు వస్తున్నాయి. ఈ చక్రాన్ని డిజిటల్‌ డిటాక్స్‌ విచ్ఛిన్నం చేస్తుంది. మెదడుకు విశ్రాంతి లభించి, రీఛార్జ్‌ అవుతుంది. 

స్క్రీన్‌ల నుంచి వచ్చే నీలి కాంతి (బ్లూ లైట్‌) దుష్ప్రభా­వాలు తగ్గిపోయి కంటికి మంచి నిద్ర దొరుకుతుంది. ఇంట్లో భార్యాభర్త, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు, స్నేహి­తులతో ముఖాముఖి చర్చించుకొనే అవకాశం లభిస్తుంది. తద్వారా మనుషుల మధ్య బంధాలు బలపడి, మనస్ప­ర్థలు తగ్గుతాయని మానసిక వైద్యులు వెల్లడిస్తున్నారు.

డీటాక్స్‌ సమయంలో రన్నింగ్, జాగింగ్, జిమ్‌లో వ్యాయా­మాలు చేయడం, ఇంటి, తోట పనులు వంటి శ్రమకు కేటాయించడంతో బీపీ, షుగర్‌ వంటి జీవన శైలి జబ్బుల ప్రమాదం తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement