హెచ్‌3ఎన్‌2పై ఆందోళన వద్దు

The impact of H3N2 is not much in the state - Sakshi

రాష్ట్రంలో ఈ ఫ్లూ ప్రభావం పెద్దగా లేదు 

ముక్కు నుంచి గొంతు మధ్యలోనే దీని ఎఫెక్ట్‌ 

రెసిస్టెన్స్‌ పవర్‌ తక్కువగా ఉన్న కొందరిలో న్యుమోనియా 

జ్వరం, జలుబు వస్తే పారాసిటమాల్‌ వాడితే చాలు 

అనవసరంగా యాంటీబయోటిక్స్‌ వాడొద్దు 

డీఎంఈ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ 

సాక్షి, అమరావతి : కొత్త రకం ఫ్లూ హెచ్‌3ఎన్‌2 ప్రభావం రాష్ట్రంలో పెద్దగా లేదని డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) డాక్టర్‌ వినోద్‌కుమార్‌ స్పష్టం చేశారు. అనవసరంగా ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. విజయవాడలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. 

ముక్కు నుంచి గొంతు మధ్యలోనే ఈ ఫ్లూ వైరస్‌ ప్రభావం ఉంటుంది. 
 కరోనా వైరస్‌లాగా ఊపిరితిత్తుల్లోకి చొచ్చుకుపోయే స్వభావం దీనికి లేదు. 
♦ రెసిస్టెన్స్‌ పవర్‌ తక్కువగా ఉన్న కొందరిలో ఊపిరితిత్తుల్లోకి చేరి న్యుమోనియాకు దారితీస్తుంది. 
 ప్రస్తుతం ఫ్లూ చిన్న పిల్లలు, వృద్ధుల్లో కొంతమేర ప్రభావం చూపుతుంది. దీనిని కనిపెట్టడం చాలా సులభం.  
ప్రభుత్వాస్పత్రుల్లో ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌లు ద్వారా కేసులు గుర్తిస్తున్నాం  
 తిరుపతి స్విమ్స్‌లో తరచూ వైరస్‌లపై సీక్వెన్సింగ్‌ చేస్తుంటాం.. ఇలా గత జనవరిలో 12 కేసులు, ఫిబ్రవరిలో 9 హెచ్‌3ఎన్‌2 కేసులు నమోదయ్యాయి.  
దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలున్న వారు జాగ్రత్తలు తీసుకోవాలి.  టవైరల్‌ జ్వరాలకు యాంటిబయోటిక్స్‌ పనిచేయవు. కాబట్టి జ్వరం వచి్చందని  ప్రజలు అనవసరంగా వాటిని వాడొద్దు.  

ఆస్పత్రుల్లో చేరేవారు చాలా అరుదు 
ఇక జ్వరాలు, ఇతర లక్షణాలతో ఆస్పత్రులకు వస్తున్నవారి­లో ప్రతి వెయ్యి ఓపీల్లో 0.1 శాతం సందర్భాల్లో అడ్మిషన్‌ అవసరం అవుతోందని విజయవాడ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రి­న్సిపల్, జనరల్‌ మెడిసిన్‌ వైద్యుడు డా. సుధాకర్‌ చెప్పా­రు.

ఎవరికైనా జ్వరం, జలుబు వచ్చినట్లయితే పారాసిటమా­ల్, దగ్గు ఉన్నట్లైతే సిట్రిజీన్‌ మాత్ర వాడితే సరిపోతుందన్నా­రు. అదే విధంగా గొంతు ఇన్‌ఫెక్షన్‌ ఉంటే వేడినీళ్లు తాగడంతో పాటు, విక్స్‌ బిళ్లలు వాడాలన్నారు. మరోవైపు.. గుంటూ­రు జ్వరాల ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రఘు మాట్లాడు­తూ.. ప్రతి ఏడాది సీజన్‌ మారేప్పుడు జ్వరాలు వస్తుంటాయ­న్నారు. వీటికి ఇంటి వద్దే జాగ్రత్తలు తీసుకుంటే చాలన్నారు.  

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆ కాలేజీల్లో అడ్మిషన్లు 
కాగా.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఐదు కొత్త వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌ అడ్మిషన్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందని డీఎంఈ వినోద్‌ తెలిపారు. విజయనగరం వైద్య కళాశాలకు ఇప్పటికే అనుమతులు లభించాయని.. మిగిలిన నాలుగు కళాశాలలకు అనుమతులు వస్తాయని భావిస్తున్నామన్నారు.

ఏడాదికి మూడు నుంచి నాలుగు వైద్య కళాశాలలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళికలు రచించామన్నారు. అలాగే, ఖాళీ అయిన 246 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను ఎన్నికల కోడ్‌ ముగియగానే భర్తీ చేస్తామని.. సీనియర్‌ రెసిడెంట్‌ల భర్తీకి వాక్‌–ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని వినోద్‌ చెప్పారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top