దక్షిణ కోస్తాకు భారీ వర్ష సూచన

Heavy Rain Forecast For South Coastal Andhra - Sakshi

సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి తమిళనాడు తీరానికి సమీపంలో కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల రెండు రోజులు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. శని, ఆదివారాల్లో దక్షిణ కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది.

దీపావళి తర్వాత చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. గడచిన 24 గంటల్లో కావలిలో 7 సెం.మీ., సూళ్లూరుపేటలో 6, ఒంగోలు, తడ, వింజమూరు, శ్రీకాళహస్తి, తొట్టంబేడులో 4, వెంకటగిరి, చీమకుర్తి, సత్యవేడు, పుల్లంపేటలో 3 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top