సాక్షి, నెల్లూరు జిల్లా: నెల్లూరు జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విజయవాడ నుంచి తిరుపతికి పాలు నింపుకునేందుకు వెళ్తుండగా.. వెంకటాచలం-మనుబోలు మధ్య కొమ్మలపూడి జంక్షన్ వద్ద ఘటన జరిగింది. గూడ్స్ రైలుకు ఉన్న పాల ట్యాంకర్ ట్రాక్పై అడ్డంగా పడిపోయింది. సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది, అధికారులు చర్యలు చేపట్టారు.


