Irrigation‌ Projects: గడువులోగా పూర్తిచేయాలి: సీఎం జగన్‌ | CM YS Jagan Review Meet On Department of Water Resources | Sakshi
Sakshi News home page

Irrigation‌ Projects: గడువులోగా పూర్తిచేయాలి: సీఎం జగన్‌

Mar 29 2022 10:48 AM | Updated on Mar 29 2022 5:46 PM

CM YS Jagan Review Meet On Department of Water Resources - Sakshi

ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. పోలవరం సహా ప్రాధాన్యతలుగా నిర్ణయించుకున్న ప్రాజెక్టులపై సీఎం సమీక్షించారు.

సాక్షి, తాడేపల్లి: ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. పోలవరం సహా ప్రాధాన్యతలుగా నిర్ణయించుకున్న ప్రాజెక్టులపై సీఎం సమీక్షించారు. ప్రాజెక్టుల వారీగా ఇప్పటివరకూ జరిగిన పనులు, భవిష్యత్తులో పూర్తిచేయాల్సిన పనులపైనా అధికారులతో సీఎం విస్తృత సమీక్ష చేపట్టారు. ప్రాజెక్టుల వారీగా లక్ష్యాలను సీఎం నిర్దేశించారు. అనుకున్న గడువులోగా పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు.

పోలవరంలో దిగువ కాఫర్‌ డ్యాం, ఈసీఆర్‌ఎఫ్‌డ్యాంలకు సంబంధించిన పలు అంశాలపై సమావేశంలో చర్చ
డౌన్‌ స్ట్రీం కాఫర్‌ డ్యాంకు సంబంధించి అన్ని డిజైన్లూ వచ్చాయని, జులై 31 కల్లా పని పూర్తవుతుందని తెలిపిన అధికారులు
ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాంకు సంబంధించి డిజైన్లు కూడా త్వరలో ఖరారవుతాయని తెలిపిన సీఎం
వీలైనంత త్వరగా డిజైన్లు తెప్పించుకోవాలన్న సీఎం
వెంటపడి మరీ పనులు చేయించుకోవాలన్న సీఎం
ఆర్‌ అండ్‌ ఆర్‌పైన ప్రత్యేక దృష్టిపెట్టామన్న అధికారులు
ప్రాధాన్యతా క్రమంలో కుటుంబాలను తరలిస్తున్నామన్న అధికారులు
మొదటి ప్రాధాన్యత కింద తరలించాలనుకున్న వారిని ఆగస్టుకల్లా తరలించేలా తగిన చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు
మొదటగా ప్రాధాన్యతగా నిర్దేశించుకున్న 20946 కుటుంబాల్లో ఇప్పటికే 7962 మందిని తరలించామన్న అధికారులు.
3228 మంది ఓటీఎస్‌ కు దరఖాస్తు చేసుకున్నారని, మిగిలిన 9756 మందిని తరలించాలన్న అధికారులు.
వీరిని త్వరగా పునరావాసం కల్పించాలన్న సీఎం. 
డీబీటీ పద్ధతుల్లో ఆర్‌ అండ్‌ ఆర్‌ కింద ప్యాకేజీలు చెల్లించాలన్న సీఎం. 

నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, అవుకు టన్నెల్‌–2, పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు హెడ్‌ రెగ్యులేటర్‌ వర్క్స్, పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్‌ 1 నుంచి నీటి విడుదల, ఇదే ప్రాజెక్టులో టన్నెల్‌–2 పనులు, వంశధార–నాగావళి అనుసంధానం, వంశధార స్టేజ్‌ –2లో ఫేజ్‌–2 పనులపైనా సీఎం సమీక్ష
నెల్లూరు బ్యారేజీ పనులు పూర్తిచేసి మే 15 నాటికి ప్రారంభోత్సవానికి సిద్ధంచేస్తున్నామన్న అధికారులు
సంగం బ్యారేజీ పనులు కూడా దాదాపుగా పూర్తి కావొచ్చాయన్న అధికారులు. మే 15 నాటికి పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్దం చేస్తామన్న అధికారులు
సంగం బ్యారేజికి మేకపాటి గౌతమ్‌ రెడ్డి సంగం బ్యారేజిగా నోటిఫై చేయాలని ఆదేశించిన సీఎం
అవుకు టన్నెల్‌–2లో మిగిలిపోయిన పనులు కేవలం 77.5 మీటర్లు, ఈసీజన్‌లో పనులు పూర్తిచేస్తామన్న అధికారులు
120 రోజుల్లో పనులు పూర్తిచేసేలా ప్రణాళిక వేశామన్న అధికారులు.
లైనింగ్‌ సహా ఆగస్టుకల్లా పనులు పూర్తయ్యేలా అన్నిరకాల చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశాలు

పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి టన్నెల్‌–2 పనులపై సీఎం సమీక్ష
నెలకు 400 మీటర్ల మేర పనులు చేస్తున్నామన్న అధికారులు
ఇది మరింతగా పెంచి 500 మీటర్ల వరకూ టన్నెల్‌ తవ్వకం పనులు చేస్తామన్న అధికారులు. టన్నెల్‌ 1 ద్వారా సెప్టెంబర్‌ నెలలో నీటి సరఫరా ప్రారంభోత్సవానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించిన సీఎం
2023 నాటికి టన్నెల్‌ –2 సహా అన్నిరకాల పనులు పూర్తిచేసి.. రెండు టన్నెళ్ల ద్వారా నీళ్లు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు
వంశధార – నాగావళి పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్న అధికారులు
అక్టోబరు నాటికి పూర్తయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం
వెలగొండ ప్రాజెక్టు కింద ఉదయగిరి, బద్వేలు ప్రాంతాలకు నీటిని అందించడానికి టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం

వంశధార నదిపై గొట్టా బ్యారేజి వద్ద నీటిని లిఫ్ట్‌ చేసి హిరమండలం రిజర్వాయర్‌లోకి పంపింగ్‌కు సంబంధించిన ప్రణాళికలు రూపొందిచాలని ఆదేశం
వంశధారపై నేరడి వద్ద  బ్యారేజీకి సన్నాహాలపైనా సీఎం సమీక్ష. 
ప్రాజెక్టు నిర్మాణ వ్యయం దాదాపుగా ఏపీనే భరిస్తోందని, బ్యారేజీ నిర్మాణం చేస్తే ఒడిశాకూడా సగం నీటిని వాడుకునే అవకాశం ఉందన్న సీఎం. 
ఇరు రాష్ట్రాలకూ ఇది ప్రయోజనకరమన్న సీఎం. వీలైనంత త్వరగా నేరడి పనులు ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం. 

ఉత్తరాంధ్రలోని నాలుగు ప్రాజెక్టు పనులపైనా సీఎం సమీక్ష
తోటపల్లి బ్యారేజీ, గజపతినగరం బ్రాంచి కెనాల్, తారరామ తీర్థసాగర్, మహేంద్ర తనయ ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టుపైనా సీఎం సమీక్ష.
తోటపల్లి ప్రాజెక్టు కింద అన్ని పనులనూ వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సీఎం ఆదేశాలు. 
గజపతినగరం బ్రాంచ్‌ కెనాల్‌ కింద పనులనూ వేగవంతం చేయాలన్న సీఎం.
ఆర్థిక శాఖ అనుమతులు తీసుకుని టెండర్లు పిలవాలని ఆదేశం

తారకరామ తీర్థసాగర్‌లో రిజర్వాయర్‌ పనులు పూర్తికావొచ్చాయన్న అధికారులు. మిగిలిన పనులు వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశాలు
సారిపల్లి గ్రామంలో ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజి ఇవ్వాలని ఆదేశాలు
టన్నెల్‌ సహా ఇతర పనులూ కొనసాగుతున్నాయన్న అధికారులు
మహేంద్ర తనయ ప్రాజెక్టు పనులపైనా సీఎం సమీక్ష
ప్రాజెక్టును పూర్తిచేయడానికి తదేక దృష్టిపెట్టాలన్న సీఎం
ఆర్థిక శాఖ అనుమతులు తీసుకుని టెండర్లు పిలవాలని ఆదేశం

ఉత్తరాంధ్ర సుజల స్రవంతిపైనా దృష్టిపెట్టాలన్న సీఎం
మెయిన్‌ కెనాల్‌ను శ్రీకాకుళం వరకూ తీసుకెళ్లాలన్న సీఎం
దీనికి సంబంధించిన భూ సేకరణ తదితర అంశాలపై దృష్టిపెట్టాలన్న సీఎం

సమీక్షా సమావేశానికి జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్, చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ సమీర్‌ శర్మ, జలవనరుల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శశిభూషణ్‌ కుమార్, ఈఎన్‌సీ నారాయణ రెడ్డి, ఆర్‌ అండ్‌ ఆర్‌ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement