సయ్యంటే సై అన్న ఎద్దులు.. జనాల్లో భయం..! | Bulls Fight Creates Chaos at Kakinada Junction | Sakshi
Sakshi News home page

సయ్యంటే సై అన్న ఎద్దులు.. జనాల్లో భయం..!

May 23 2026 9:08 AM | Updated on May 23 2026 9:10 AM

Bulls Fight Creates Chaos at Kakinada Junction

కాకినాడ: ఏ విషయంలో తేడా వచ్చిందో ఏమో.. సయ్యంటే సైయ్యంటూ ఢీకొన్నాయీ వృషభరాజాలు. సహజంగానే బలిష్టంగా ఉండే ఆ ఎద్దులు నడిరోడ్డుపై అలా వీరంగం సృష్టింస్తుంటే చుట్టుపక్కల వారు.. వాహన చోదకులు.. పాదచారులు ఒకింత భీతిల్లారు. ఏ మాత్రంఅదుపుతప్పి అవి తమ మీద పడినా అంతే సంగతులు. ఓ అరగంట తరవాత అవే అలసిపోయి తలోదారీ వెళ్లాక కానీ వారి ఆందోళన తీరలేదు. అంబాజీపేట నాలుగు రోడ్ల జంక్షన్‌లో శుక్రవారం ఉదయం ఈ వీరంగం స్థానికులకు గగుర్పొడిచేలా సాగింది.  

Advertisement
 
Advertisement
Advertisement