
సాక్షి, అనకాపల్లి: ఏపీలో ఎక్సైజ్ అధికారులకు ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నియోజకవర్గంలో లిక్కర్ షాపు ఏర్పాటుపై లోకాయుక్త ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే నోటీసులు జారీ చేసింది.
వివరాల ప్రకారం.. అనకాపల్లి ఎక్సైజ్ అధికారులకి లోకాయుక్త ఊహించని షాకిచ్చింది. హోం మంత్రి అనిత నియోజకవర్గంలో లిక్కర్ షాపు ఏర్పాటుపై లోకాయుక్త నోటీసు జారీ చేసింది. కూటమి నాయకుల అండదండలతో జాతీయ రహదారి పక్కనే వైన్ షాపుకి ఎక్సైజ్ అధికారులు అనుమతులు ఇచ్చారు. అయితే, జాతీయ రహదారికి 140 మీటర్ల దూరంలోనే వైన్ షాపు ఉండటంపై లోకాయుక్తా మండిపడింది. అనుమతులు ఇవ్వాలి. మొదట్లో వైన్ షాపు ఏర్పాటుపై ఫిర్యాదు వచ్చినా నోటీసుల పేరుతో అధికారులు కాలయాపన చేయడం గమనార్హం. ఇక, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జాతీయ రహదారికి కనీసం 220 మీటర్ల దూరంలో మాత్రమే మద్యం దుకాణాలు ఉండాలి.