AP: రాష్ట్రంలో అసలేం జరుగుతోంది?.. హెబియ‌స్ కార్ప‌స్ పిటిష‌న్‌ల‌పై హైకోర్టు ఆశ్చర్యం | AP High Court Investigation on Habeas Corpus Petitions | Sakshi
Sakshi News home page

AP: రాష్ట్రంలో అసలేం జరుగుతోంది?.. హెబియ‌స్ కార్ప‌స్ పిటిష‌న్‌ల‌పై హైకోర్టు ఆశ్చర్యం

Nov 8 2024 1:42 PM | Updated on Nov 8 2024 3:31 PM

AP High Court Investigation on Habeas Corpus Petitions

సాక్షి,తాడేపల్లి : కూట‌మి ప్ర‌భుత్వంలో పోలీసుల అక్రమ నిర్బంధాలపై వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ల కుటుంబ స‌భ్యులు హైకోర్టును ఆశ్ర‌యించారు. పదుల సంఖ్య‌లో హెబియ‌స్ కార్ప‌స్ పిటిష‌న్‌ల‌ను దాఖ‌లు చేశారు. ఆ పిటిష‌న్‌ల‌పై ఇవాళ (శుక్ర‌వారం) ఉదయం న్యాయస్థానం విచార‌ణ చేప‌ట్టింది. 

విచార‌ణ సంద‌ర్భంగా ఒకేసారి భారీ మొత్తంలో దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్‌ల‌పై హైకోర్ట్ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసింది. అస‌లు రాష్ట్రంలో ఏం జ‌ర‌గుతుందంటూ ప్ర‌శ్నించింది. విచార‌ణ‌కు రావాల‌ని ప్రభుత్వ అడ్వకేట్‌ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌కు ఆదేశించింది. మధ్యాహ్నానికి వాయిదా వేసింది. 
 
వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌లు జింకాల రామాంజనేయులు, తిరుపతి లోకేష్, మునగాల హరీశ్వరరెడ్డి, నక్కిన శ్యామ్, పెద్దిరెడ్డి సుధారాణి-వెంకటరెడ్డి దంపతులు, మహమ్మద్ ఖాజాభాషాల‌ను పోలీసులు అక్ర‌మంగా నిర్భందించారు. పోలీసుల నిర్భందంపై బాధితుల కుటుంబ స‌భ్యులు హైకోర్టు మెట్లెక్కారు. త‌మ‌కు న్యాయం చేయాల‌ని కోరుతూ ఆరు హెబియ‌స్ కార్ప‌స్ పిటిష‌న్ల‌ను దాఖ‌లు చేశారు. ఆ పిటిష‌న్‌ల‌పై హైకోర్టు ఇవాళ విచార‌ణ చేప‌ట్టింది. విచార‌ణ‌లో ఒకేసారి ఇన్ని హెబియస్ కార్పస్ పిటిషన్లు పడటంపై హైకోర్టు ఆశ్చర్యం వ్య‌క్తం చేసింది. హెబియస్ కార్పస్ పిటిషన్‌ల‌పై లంచ్‌ తర్వాత విచారణ చేపట్టనుంది హైకోర్టు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement