సీఎం జగన్‌ బర్త్‌డే: బద్వేలును రెవెన్యూ డివిజన్‌గా కేటాయిస్తూ జీవో విడుదల..

AP Cm YS Jagan GO Release For Badvel Revenue Division - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ కడప: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా బద్వేలుకు సీఎం జగన్‌ కానుక అందించారు. బద్వేల్‌ను రెవెన్యూ డివిజన్‌గా కేటాయిస్తూ జీవో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధకు బద్వేలు నియోజకవర్గ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. కాగా ఈ ఏడాది జూలైలో బద్వేలు పర్యటనకు వచ్చిన సీఎం జగన్‌ బద్వేల్‌కు రెవెన్యూ డివిజన్‌ మంజూరు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం బద్వేలను రెవెన్యూ డివిజన్‌గా కేటాయిస్తూ మంగళవారం జీవో విడుదల చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top