మంచి పనులకు విఘ్నాలు తొలగిపోవాలి.. ఏపీ ప్రజలకు సీఎం జగన్ వినాయకచవితి శుభాకాంక్షలు

సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మంచి పనులకు విఘ్నాలు తొలగిపోయి.. ప్రజలందరికీ శుభాలు కలగాలని, విజయాలు సిద్ధించాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. అలాగే గణనాథుని కరుణాకటాక్షాలతో ప్రతి కుటుంబం.. సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని సీఎం జగన్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: చవితి పండుగపై ఏపీలో ఏ ఆంక్షలూ లేవు
సంబంధిత వార్తలు