AP: కేబినెట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలివే..

AP Cabinet Key Decisions Minister Chelluboina Gopalakrishna - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ కేబినేట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాకు వెల్లడించారు. కేబినెట్ భేటీలో మొత్తం 57 ఆంశాలకు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు.

ఏపీ కేబినెట్‌లో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు ఇవే..

రూ.1.26 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం
► గ్రీన్ ఎనర్జీలో రూ.81వేల కోట్ల పెట్టుబడుల ప్రాజెక్టులకు ఆమోదం
► 21వేల ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్టులకు ఆమోదం
► ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా 195 మంది ఖైదీల విడుదలకు ఆమోదం
► వైఎస్సార్ చేయూతకు కేబినెట్ ఆమోదం.. ఈనెల 22నుంచి సీఎం జగన్ చేతుల మీదుగా కార్యక్రమం.
► ఆర్‌ అండ్ బీలో ఆర్కిటెక్‌  విభాగానికి 8 పోస్టుల మంజూరు
► దివ్యాంగులకు 4 శాతం ఉద్యోగాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్లకు ఆమోదం
► భావనపాడు పోర్టు విస్తరణకు ఆమోదం
► సచివాలయంలో 85 అదనపు పోస్టులకు ఆమోదం
ఒక్కో సచివాలయానికి రూ.20లక్షల నిధుల మంజురూకు ఆమోదం 
విశాఖపట్నం పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణానికి పరిపాలనా ఆమోదం
కురుంపా ట్రైబల్ ఇంజినీరింగ్ కాలేజీలో సిబ్బంది నియామకానికి ఆమోదం
నంద్యాల జిల్లా పాణ్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ఆమోదం
ప్రతీ మండలంలో రెండు పీహెచ్‌సీలకు ఆమోదం
పైడిపాలెం ప్రాజెక్ట్‌ నిర్వాసితులకు ఆర్‌ అండ్ ఆర్‌ ప్యాకేజీ
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ఆమోదం
చదవండి: ఇక మీదట వాళ్ల ఆరోపణలను ఉపేక్షించొద్దు: సీఎం జగన్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top