ఏపీలో కర్ఫ్యూ జూన్ 20 వరకు పొడిగింపు

Amaravati: Andhra pradesh Extends Curfew Till June 20  - Sakshi

సాక్షి, అమరావతి: రాష్టంలో కరోనా కట్టడికి కర్ఫ్యూ జూన్ 20 వరకు పొడిగిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక కర్ఫ్యూ సమయంలో 144 సెక్షన్ యధావిధిగా కొనసాగనుంది. కాగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉండనుట్లు సర్కార్‌ తెలిపింది. ఇక ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పని చేయనున్నాయి. మధ్యాహ్నం 2 నుంచి మరుసటి రోజు ఉదయం 6 వరకు కర్ఫ్యూ యధాతధంగా కొనసాగుతున్నట్లు  తెలిపింది.

చదవండి: టెస్టులు, వ్యాక్సిన్‌లో ఏపీ సరికొత్త రికార్డు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top