ఏపీలో ఒకేరోజు 68,829 కరోనా పరీక్షలు | 7553 New Coronavirus Positive Cases Reported In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో ఒకేరోజు 68,829 కరోనా పరీక్షలు

Sep 22 2020 8:15 PM | Updated on Sep 22 2020 8:55 PM

7553 New Coronavirus Positive Cases Reported In Andhra Pradesh - Sakshi

ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 5,62,376. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 71,465.

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దూసుకెళ్తోంది. గడిచిన 24 గంటల్లో 68,829 నమూనాలు పరీక్షించగా 7553 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,39,302 కు చేరింది. తాజా పరీక్షల్లో 28,224 ట్రూనాట్‌ పద్ధతిలో, 40,605 ర్యాపిడ్‌ టెస్టింగ్‌ పద్ధతిలో చేశారు. వైరస్‌బారిన పడ్డవారిలో కొత్తగా 51 మంది ప్రాణాలు విడువడంతో మొత్తం మృతుల సంఖ్య 5461 కు చేరింది. గత 24 గంటల్లో వైరస్‌ బాధితుల్లో 10,555 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 5,62,376. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 71,465. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ వైద్యారోగ్యశాఖ మంగళవారం హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 52,29,529 నమూనాలను పరీక్షించామని తెలిపింది.
(చదవండి: త్వరలోనే డీఎస్సీ 2020: ఆదిమూలపు సురేశ్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement