Andhra Pradesh Logs 14,986 New Covid-19 Cases - Sakshi
Sakshi News home page

ఏపీలో కొత్తగా 14,986 కరోనా కేసులు

May 10 2021 5:35 PM | Updated on May 10 2021 6:02 PM

14986 New Coronavirus Positive Cases Recorded In AP - Sakshi

సాక్షి, అమరావతి: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 60,124 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 14,986 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 12,99,694 మందికి కరోనా వైరస్‌ సోకింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 84 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 8,791కు చేరింది. గడిచిన 24 గంటల్లో 16,167 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు మొత్తం 11 లక్షల 4 వేల 431 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

 ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సోమవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 1,89,367 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 1,74,28,059 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement