ఎగిరి గంతేశారు. వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు.
బాణసంచా మోత మోగించారు. ఆదివారం టీ–20 వరల్డ్కప్ ఫైనల్లో టీమిండియా అద్భుత విజయం సాధించడంతో జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఆనందంలో మునిగితేలారు. అనంతపురంలో టవర్క్లాక్ వద్దకు యువత పెద్ద ఎత్తున చేరుకుని వేడుకలు చేసుకున్నారు. కేక్లు కట్ చేసి సంతోషం పంచుకున్నారు. పలువురు జాతీయ జెండాలు చేతబట్టి ‘జయహో భారత్’ నినాదాలు మార్మోగించారు. – అనంతపురం


