
వైఎస్సార్సీపీ అనుబంధ విభాగంలో చోటు
అనంతపురం కార్పొరేషన్: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో పార్టీ యువజన విభాగంలో పలువురికి చోటు కల్పిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి మదన్మోహన్ రెడ్డి (అనంతపురం), రాష్ట్ర కార్యదర్శిగా బి.రాజేష్ (ఉరవకొండ), రాష్ట్ర అధికార ప్రతినిధిగా గొర్ల మారుతీనాయుడు, రాష్ట్ర సహాయ కార్యదర్శులుగా జి.రామాంజినేయులు (కళ్యాణదుర్గం), వాసగిరి నాగ్ (అనంతపురం), జోనల్ అధ్యక్షుడిగా వై.ప్రణయ్రెడ్డి (ఉరవకొండ) నియమితులయ్యారు.
‘ఖజానా’లో బదిలీల సందడి
అనంతపురం అర్బన్: ఉమ్మడి జిల్లా పరిధిలోని ఖజానా శాఖలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియపై బదిలీల నిర్వహణ కమిటీ సభ్యులు అనంతపురం జిల్లా డీడీ వెంకటేశ్వర్లు, ఏటీఓ రాణి, శ్రీసత్యసాయి జిల్లా డీడీ శ్రీనివాసులు, ఏటీఓ పవిత్ర శుక్రవారం అనంతపురంలోని ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్ చాంబర్లో సమీక్షించారు. ఉమ్మడి జిల్లాల పరిధిలో 34 మంది సీనియర్ అకౌంటెంట్లు, 15 మంది జూనియర్ అకౌటెంట్లు, 12 మంది ఆఫీస్ సబార్డినుట్లు చొప్పున మొత్తం 61 మంది బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఒకే స్థానంలో ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న సీనియర్ అకౌంటెంట్లు 19 మంది, జూనియర్ అకౌంటెంట్లు 9 మంది, ఆఫీసు సబార్డినేట్లు 8 మంది ఉన్నారు. అనంతరం డీడీ వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ.. ఖజానా శాఖలో బదిలీలకు సంబంధించి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ అంటూ ఏదీ ఉండదన్నారు. ఖాళీల జాబితా ప్రకటించామని, బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులు ఆ మేరకు ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుందన్నారు. వారి దరఖాస్తులను పరిశీలించి నిబంధనల ప్రకారం బదిలీ ప్రక్రియ పూర్తి చేసి స్థానాలను కేటాయిస్తామన్నారు.
రైల్లో నగలు చోరీ చేస్తూ పట్టుబడిన దొంగ
గుత్తి: రైలులో నగదు, నగలు చోరీ చేస్తూ ఓ దొంగ పట్టుపడ్డాడు. జీఆర్పీ పోలీసులు తెలిపిన మేరకు... శుక్రవారం మచిలీపట్నం – ధర్మవరం ఎక్స్ప్రెస్ రైలులోని కోచ్–1లో ప్రయాణిస్తున్న ఓ యువకుడు ఓ ప్రయాణకుడి బ్యాగ్లోని బంగారు నగలు, నగదు, సెల్ఫోన్లు అపహరిస్తుండగా గమనించి మరో ప్రయాణికుడు వెంటనే పోలీసు కంట్రోల్ రూమ్కు సమాచారం అందించాడు. రైలు గుత్తి రైల్వే స్టేషన్కు చేరుకోగానే జీఆర్పీ ఎస్ఐ నాగప్ప, హెడ్ కానిస్టేబుల్ నాగరాజు, సివిల్ కానిస్టుబుల్ భాస్కర్ నాయుడు కోచ్–1లోకి చేరుకుని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి ఒకటిన్నర తులం బంగారు ఆభరణాలు, రూ.10 వేలు నగదు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన యువకుడు నంద్యాల జిల్లాకు చెందిన జయరాజ్గా గుర్తించి, పోలీస్ స్టేషన్కు తరలించారు. నిందితుడిని సమగ్ర విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

వైఎస్సార్సీపీ అనుబంధ విభాగంలో చోటు

వైఎస్సార్సీపీ అనుబంధ విభాగంలో చోటు