
జేఈఈ అడ్వాన్స్డ్లో అదుర్స్
● ఆలిండియా ఓపెన్ కేటగిరీలో భూపతి నితిన్ అగ్రిహోత్రికి 183వ ర్యాంకు
అనంతపురం ఎడ్యుకేషన్/శింగనమల: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ‘అనంత’ విద్యార్థులు అదుర్స్ అనిపించారు. పలువురు జాతీయస్థాయి ర్యాంకులు సాధించి శభాష్ అనిపించుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక ఐఐటీ కళాశాలల్లో ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి నిర్వహించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్ పరీక్షలు 12.68 లక్షల మంది విద్యార్థులు రాశారు. 2.5 లక్షల మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఐఐటీల్లో 17 వేల సీట్లు, తక్కిన సీట్లు ఎన్ఐటీ, ఐఐఐటీ, కేంద్ర ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థల్లో బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్), ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలు నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం విడుదలైన ఫలితాల్లో భూపతి నితిన్ అగ్నిహోత్రి 360 మార్కులకు గాను 264 మార్కులు సాధించి అఖిల భారత స్థాయి ఓపెన్ కేటగిరీలో 183 ర్యాంక్ సాధించి సత్తా చాటాడు. అలాగే శింగనమల మండలం సీ.బండమీదపల్లి గ్రామానికి చెందిన శెట్టిపల్లి శశిధర్రెడ్డి 638, అనంతపురం నగరానికి చెందిన పి. విశాల్ 3,946, భావన 10,889, మోక్ష సాయి రెడ్డి 12,809, ఆసిఫ్ 16,099, సవిత్ కుమార్ రావు 16,884 ర్యాంకు, డి.లోకేష్ కుమార్ 114 (ఎస్సీ కేటగిరీ) ర్యాంకు, ప్రణయ్ చౌదరి 5,499 (ఈడబ్ల్యూఎస్) ర్యాంకు సాధించారు. వీరందరికీ నేరుగా ఐఐటీలో ఇంజినీరింగ్ సీట్లు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

జేఈఈ అడ్వాన్స్డ్లో అదుర్స్

జేఈఈ అడ్వాన్స్డ్లో అదుర్స్

జేఈఈ అడ్వాన్స్డ్లో అదుర్స్

జేఈఈ అడ్వాన్స్డ్లో అదుర్స్

జేఈఈ అడ్వాన్స్డ్లో అదుర్స్

జేఈఈ అడ్వాన్స్డ్లో అదుర్స్