
వారికి ఇంటి వద్దనే రేషన్ ఇవ్వండి
● కలెక్టర్ వినోద్కుమార్
అనంతపురం అర్బన్: వృద్ధులు, దివ్యాంగులు, నిస్సహాయస్థితిలో ఉన్నవారికి ఇంటి వద్దనే రేషన్ పంపిణీ చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశించారు. అనంతపురంలోని కొవూరునగర్ ఆరో వార్డు పరిధిలోని 65 ఏళ్లు పైడిన వృద్ధులు, దివ్యాంగులు, మంచానికే పరిమితమైన లబ్ధిదారుల ఇళ్ల వద్దకే బియ్యం, నిత్యాసవర సరుకులు పంపిణీని కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశారు. దివ్యాంగురాలికి సరుకులను కలెక్టర్ స్వయంగా అందజేశారు. ఇకపై 65 ఏళ్లు ౖపైబడిన వృద్ధులు, దివ్యాంగులు, నిస్సహాయులు చౌక దుకాణానికి వెళ్లాల్సిన పనిలేదన్నారు. వారికి ఇంటి వదద్దకే డీలర్లు సరుకులు చేరుస్తారన్నారు. కార్యక్రమంలో తహసీల్దారు హరికుమార్, సీఎస్డీటీ రామకృష్ణ, డీలర్ లక్ష్మీదేవి పాల్గొన్నారు.
విజిలెన్స్ తనిఖీలు
గుత్తి: స్థానిక బీసీ కాలనీలోని ప్రభుత్వ చౌక ధాన్యపు దుకాణం, మెయిన్ బజారులో ఉన్న 8వ నంబర్ దుకాణాన్ని మంగళవారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. 8వ స్టోర్లో 46 చక్కెర ప్యాకెట్లు, 89 కిలోల బియ్యం స్టాక్లో నమోదు చేసిన దాని కంటే అధికంగా ఉన్నట్లుగా గుర్తించారు. కార్యక్రమంలో విజిలెన్స్ ఎస్ఐ వెంకటప్రసాద్, ఏఓ సాయి, పీఆర్ఓ ఆదినారాయణమ్మ పాల్గొన్నారు.
ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు ఆర్థిక సాయం
అనంతపురం క్రైం: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగుల పొదుపు మరియు పరపతి సహకార సంఘం లిమిటెడ్ (ఏపీఆర్టీసీ సీసీఎస్) ద్వారా అర్హులైన ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు ఆర్థిక సాయాన్ని అందజేయనున్నారు. ఈ మేరకు ఆర్టీసీ విశ్రాంతి ఉద్యోగుల సంఘం నేత రామిరెడ్డి మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సీసీఎస్లో కనీసం ఐదేళ్ల సభ్యత్వం కలిగి, 63 సంవత్సరాలు వయసు నిండిన వారు అర్హులు. అనంతపురం డిపో వద్ద ఉన్న సంఘం కార్యాలయంలో ప్రతినిధులను సంప్రదించి దరఖాస్తులను పొందవచ్చు.
చెరకు పంట దగ్ధం
గార్లదిన్నె: మండలంలోని బూదేడులో మంగళవారం చెలరేగిన మంటల్లో చెరకు పంట దగ్ధమైంది. గ్రామానికి చెందిన శాంతరాజు మరో రైతుకు చెందిన 7 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని ఎకరాకు రూ.12 వేలు చొప్పున చెల్లించేలా ఒప్పందం చేసుకున్నాడు. అనంతరం చెరకు పంట సాగు చేపట్టాడు. మంగళవారం ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా నిప్పు రవ్వలు పడి మంటలు రాజుకున్నాయి. చూస్తుండగానే చెరకు తోటను మంటలు చుట్టుముట్టడంతో డ్రిప్ పరికరాలు, పైపులు, స్స్రింకర్లు కాలిబూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేసేలోపు రూ.10 లక్షల మేర నష్టం జరిగినట్లు బాధిత కౌలు రైతు వాపోయాడు.