ఏడాది చంద్రబాబు జమానాలో ‘అనంత’ అన్నదాత అడుగడుగునా దగా పడ్డాడు. అలవిగాని హామీలతో ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మోసానికి రైతన్న బలయ్యాడు. ఏడాది పాలనలో రైతుకు మేలు చేసే కార్యక్రమం ఒక్కటంటే ఒక్కటి కూడా చేయకుండా చేతులెత్తేయడంతో కరువ | - | Sakshi
Sakshi News home page

ఏడాది చంద్రబాబు జమానాలో ‘అనంత’ అన్నదాత అడుగడుగునా దగా పడ్డాడు. అలవిగాని హామీలతో ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మోసానికి రైతన్న బలయ్యాడు. ఏడాది పాలనలో రైతుకు మేలు చేసే కార్యక్రమం ఒక్కటంటే ఒక్కటి కూడా చేయకుండా చేతులెత్తేయడంతో కరువ

Jun 3 2025 12:24 AM | Updated on Jun 3 2025 12:24 AM

ఏడాది చంద్రబాబు జమానాలో ‘అనంత’ అన్నదాత అడుగడుగునా దగా ప

ఏడాది చంద్రబాబు జమానాలో ‘అనంత’ అన్నదాత అడుగడుగునా దగా ప

అనంతపురం అగ్రికల్చర్‌: ‘అన్నదాత సుఖీభవ’ కింద ఏడాదికి రూ.20 వేల చొప్పున రైతుకు పెట్టుబడి సాయం అందిస్తామని గొప్పగా చెప్పిన చంద్రబాబు.. తీరా అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించారు. ఇదిగో అదిగో అంటూనే ఏడాది కాలం ముగించారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ కింద మూడు విడతల్లో రూ.6 వేలు రైతుల ఖాతాల్లోకి వేసింది. కానీ చంద్రబాబు తన హామీని గాలికి వదిలేశారు. ఏడాదికి రూ.20 వేలు ఇచ్చివుంటే 2.90 లక్షల మంది వరకు రైతులకు రూ.580 కోట్లు జమ అయ్యేవి. పోనీ... పీఎం కిసాన్‌ రూ.6 వేలు పోను మిగిలిన రూ.14 వేలు ఇచ్చి ఉన్నా రూ.400 కోట్లకు పైగా సాయం అందేది. కానీ రూపాయి కూడా ఇవ్వకుండా రైతులకు కుచ్చుటోపీ పెట్టేశారు.

● 2019–24 మధ్య వైఎస్‌ జగన్‌ సర్కారు ఏటా పీఎం కిసాన్‌, రైతు భరోసా కింద రూ.13,500 ప్రకారం ఐదేళ్లలో ఒక్కో రైతుకు రూ. 67,500 ఇచ్చారు. మొత్తంగా రైతులకు రూ.1,937 కోట్ల పెట్టుబడి సాయం అందించారు.

పంటల బీమాకు పాడె..

రైతులకు ఎంతగానే మేలు చేస్తున్న ఉచిత పంటల బీమా పథకానికి కూటమి సర్కారు పాడె కట్టేసింది. ప్రీమియం రూపంలో ఏటా రూ.100 కోట్లకు పైగా రైతుల నుంచి పిండేస్తోంది. 2023 ఖరీఫ్‌, రబీకి సంబంధించి ఉచిత పంటల బీమా పథకం కింద పెద్ద మొత్తంలో పరిహారం ఇవ్వాల్సివుండగా... తమకు సంబంధం లేదన్నట్లుగా చంద్రబాబు ఎగనామం పెట్టేశారు. 2024 ఖరీఫ్‌లో కూడా ఉచిత పంటల బీమా అమలు చేసినా... పరిహారంపై నోరు మెదపడం లేదు.

● 2019–24 మధ్య వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రైతులపై పైసా కూడా ప్రీమియం భారం పడకుండా ఉచిత పంటల బీమా కింద ఏకంగా జిల్లా రైతులకు రూ.1,967 కోట్ల భారీ మొత్తంలో పరిహారం ఇచ్చింది. తొలిసారిగా ఉద్యాన రైతులకు బీమా ఇచ్చి భరోసా కల్పించారు. ఇక ప్రీమియం రూపంలో ఏటా రూ.100 కోట్ల వరకు జిల్లా రైతులకు ఆదా అయ్యేలా చేశారు.

బాధిత కుటుంబాలపై నిర్లక్ష్యం..

చంద్రబాబు ఏడాది పాలనలో పంటలు పండక, అప్పుల బాధతో 45 మంది వరకు రైతులు ఆత్మహత్య చేసుకున్నా... ప్రభుత్వం చలించడం లేదు. రూ.7 లక్షలు అందించి బాధిత కుటుంబాలను ఆదుకోవాల్సిన సర్కారు మీనమేషాలు లెక్కిస్తోంది.

● ఆత్మహత్య బాధిత కుటుంబాలకు గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో రెండు మూడు నెలల్లోపే రూ.7 లక్షల మేర పరిహారం ఇచ్చి అండగా నిలిచారు. అలా 280 బాధిత రైతు కుటుంబాలకు రూ.17.40 కోట్ల ఎక్స్‌గ్రేషియా అందించారు. గతంలో చంద్రబాబు పాలించిన 2014–19 మధ్య కాలంలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు సంబంధించి 110 కుటుంబాలు ఈ జాబితాలో ఉండటం గమనార్హం.

సున్నా వడ్డీ, పావలా వడ్డీ లేదు..

ఖరీఫ్‌, రబీలో పంట పెట్టుబడుల కోసం బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకుని ఏడాదిలోపు తిరిగి చెల్లించిన రైతులకు పావలావడ్డీ ఇవ్వలేదు. రూ.లక్ష లోపు రుణం తీసుకున్న సన్నచిన్నకారు రైతులకు వడ్డీరాయితీలు కూడా ఇవ్వకుండా దాటవేస్తున్నారు.

● గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో సున్నావడ్డీ కింద రూ.72 కోట్ల వరకు వడ్డీ మాఫీ చేయడంతో 3.40 లక్షల మంది సన్న చిన్నకారు రైతులకు ప్రయోజనం కలిగింది.

గిట్టుబాటు లేక నష్టాలు..

అరకొరగా చేతికొచ్చిన పంట ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధరలు లేక రైతులు నష్టపోతున్నారు. చీనీ, అరటి రైతులు భారీ నష్టాలు చవిచూస్తున్నా... ప్రభుత్వం ఉపశమన చర్యలు చేపట్టలేదు. పత్తి, కంది రైతులు కూడా బాగా నష్టపోయారు. అరకొర కొనుగోలు కేంద్రాలతో మమ అనిపించేశారు.

● గత ఐదేళ్ల కాలంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రైతులు పండించిన రూ.350 కోట్లు విలువ చేసే వ్యవసాయ ఉత్పత్తులు మద్దతు ధరతో కొనుగోలు చేసి మేలు చేకూర్చింది.

రైతులకు కూటమి సర్కారు కుచ్చుటోపీ

చిన్నచూపు ధోరణి ప్రదర్శిస్తున్న సీఎం చంద్రబాబు

ఒక్క రూపాయి కూడా సాయం చేయని వైనం

మోసంపై మండిపడుతున్న అన్నదాతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement