సీపీఆర్‌తో ప్రాణం నిలిపారు! | - | Sakshi
Sakshi News home page

సీపీఆర్‌తో ప్రాణం నిలిపారు!

Jun 7 2025 1:36 AM | Updated on Jun 7 2025 1:36 AM

సీపీఆ

సీపీఆర్‌తో ప్రాణం నిలిపారు!

కదిరి టౌన్‌: కరెంటు షాక్‌కు గురైన విద్యార్థి చనిపోయాడని అందరూ అనుకున్నారు. కుటుంబ సభ్యుల రోదనలు కూడా మిన్నంటాయి. అదే సమయంలో అక్కడే ఉన్న కానిస్టేబుల్‌ దేవేంద్ర సీపీఆర్‌ చేసి విద్యార్థి ప్రాణాలు నిలిపారు. ఈ ఘటన కదిరి పట్టణంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు... పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయ సమీపంలో నూతనంగా గృహ నిర్మాణాన్ని స్థానికుడు ఆంజనేయులు చేపట్టాడు. ఆయన కుమారుడు నరసింహులు శుక్రవారం ఇంటిపైకి ఎక్కిన సమయంలో పక్కనే ఉన్న 11 కేవీ విద్యుత్‌ లైనును ప్రమాదవశాత్తు తాకడంతో షాక్‌కు గురయ్యాడు. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతను మృతి చెందాడని భావించిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. విషయం తెలుసుకున్న కానిస్టేబుల్‌ దేవేంద్ర వెంటనే సీపీఆర్‌ చేయడంతో ప్రాణాలు నిలిచాయి. తర్వాత బాలుణ్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలించారు. కాగా, విద్యార్థి నరసింహులు పట్టణంలోని ఓ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు.

కో–ఆపరేటివ్‌ డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి

అనంతపురం అగ్రికల్చర్‌: రాష్ట్ర సహకార యూనియన్‌ ఆధ్వర్యంలో డిప్లొమా ఇన్‌ కో–ఆపరేటివ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ (డీసీఎం, సీఏ) కోర్సు ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ మేరకు అనంతపురంలోని రాయలసీమ సహకార శిక్షణా కేంద్రం ప్రిన్సిపాల్‌ బి.శ్రీనివాసులు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎంపికై నా అభ్యర్థులకు 10వ బ్యాచ్‌ కింద 24 వారాలు శిక్షణ ఉంటుంది. సహకార సంస్థలు, సంఘాల్లో పనిచేయాలనుకున్న వారు ఈ కోర్సు తప్పని సరిగా పూర్తి చేసి ఉండాలి. 10వ తరగతి ఉత్తీర్ణత, ఇంటర్‌.. సమాన అర్హత కలిగిన వారు అర్హులు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 29వ తేదీలోపు స్థానిక రామ్‌నగర్‌లో ఉన్న శిక్షణా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు 94907 41137లో సంప్రదించవచ్చు.

8న డిగ్రీ ఇన్‌స్టంట్‌ పరీక్ష

అనంతపురం: ఎస్కేయూ పరిధిలో డిగ్రీ ఐదో సెమిస్టర్‌లో ఒక సబ్జెక్టు ఫెయిల్‌ అయిన విద్యార్థులకు ఈ నెల 8న అనంతపురంలోని కేఎస్‌ఎన్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఇన్‌స్టంట్‌ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎవాల్యుయేషన్స్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ జీవీ రమణ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష ఉంటుంది. ఇప్పటి వరకూ పరీక్ష ఫీజు చెల్లించని వారు రూ.2,200 చలానా, పాత హాల్‌టికెట్‌ తీసుకుని పరీక్ష కేంద్రానికి నేరుగా హాజరు కావచ్చు. ఈ అంశంపై పూర్తి వివరాలను ఆయా కళాశాల ప్రిన్సిపాళ్లను అడిగి తెలుసుకోవచ్చు. కాగా, హిందూపురంలోని ఓ పరీక్ష కేంద్రంలో ఎస్కేయూ యూజీ రెండో సెమిస్టర్‌ పరీక్షలో మాస్‌కాపీయింగ్‌కు పాల్పడిన ఓ విద్యార్థిని డీబార్‌ చేసినట్లు ప్రొఫెసర్‌ జీవీ రమణ తెలిపారు.

సీపీఆర్‌తో ప్రాణం నిలిపారు! 
1
1/1

సీపీఆర్‌తో ప్రాణం నిలిపారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement