సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికై న విద్యార్థులు
పాయకరావుపేట : గత నెల 30న మాకవరపాలెంలో జరిగిన సాఫ్ట్బాల్ ఎంపికల ప్రక్రియలో శ్రీ ప్రకాష్ విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. సబ్ జూనియర్స్ అండర్ – 14 బాలుర విభాగంలో బి.సార్ధక్ , డి.నంద కిషోర్ బాలికల విభాగంలో వి.గీతా ప్రవస్తి, కె.రాఘ వర్షిణి అనకాపల్లి తరపున సెప్టెంబరు 12 నుండి 14 వరకు విజయనగరం జిల్లా బొబ్బిలిలో రాష్ట్ర స్ధాయి పోటీలకు ఎంపికై నట్టు శ్రీ ప్రకాష్ విద్యానికేతన్ ప్రధానోపాధ్యాయుడు డి.వి.శ్రీనివాస్ తెలిపారు. ఎంపికై న విద్యార్థులను విద్యాసంస్థల అధినేత సిహెచ్.వి.కె నరసింహారావు, సంయుక్త కార్యదర్శి విజయ్ ప్రకాష్, సీనియర్ ప్రిన్సిపాల్ ఎం.వి.వి.ఎస్ మూర్తి, కోచ్ విజయ్ అభినందించారు.


