మాడుగుల: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్థానిక సీహెచ్సీలో శనివారం పారా మెడికల్ సిబ్బంది మోకాళ్లపై నిలుచుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, విధి నిర్వహణలో మృతి చెందిన వారికి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని, మరణించిన ఉద్యోగి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పారా మెడికల్ సిబ్బంది కుమారి, వరలక్ష్మి, లోవరాజు, తాతాజీ, కాంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


