నూకాంబిక సన్నిధిలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ | - | Sakshi
Sakshi News home page

నూకాంబిక సన్నిధిలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

Aug 27 2026 12:24 AM | Updated on Aug 27 2026 12:24 AM

అనకాపల్లి: స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారిని బుధవారం రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సహాయ కమిషనర్‌ యాళ్ల శ్రీధర్‌, చైర్మన్‌ పీలా నాగశ్రీనులు మంత్రి దంపతులను శాలువాలతో సత్కరించి, అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మొదటిసారిగా కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారి ఆలయ నిర్మాణం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డైరెక్టర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement