ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణం చేసే స్థలాన్ని పరిశీలిస్తున్న జీఎం దేవరాజు
మాకవరపాలెం : మండలంలోని శెట్టిపాలెంలో వచ్చే నెల 4న కాఫీ ప్రాసెసింగ్ యూనిట్కు శంకుస్థాపన చేయనున్నట్టు జీసీసీ జీఎం దేవరాజు తెలిపారు. శెట్టిపాలెం గ్రామ సమీపంలో కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణానికి భూమిని సేకరించారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ భూమిని ఆయన పరిశీలించి, శంకుస్థాపనకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 4న ఈ కాఫీ యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు. రూ.10 కోట్లతో 12 ఎకరాల్లో ఈ యూనిట్ను నిర్మిస్తున్నామన్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు శంకుస్థాపన చేయనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో జీసీసీ అధికారి విశ్వనాథం, శెట్టిపాలెం మాజీ సర్పంచ్ అల్లు రామునాయుడు పాల్గొన్నారు.


