న్యూస్రీల్
శనివారం శ్రీ 23 శ్రీ మే శ్రీ 2026
ఎస్ఐల బదిలీ
అనకాపల్లి: జిల్లాలో పలువురు ఎస్ఐలను బదిలీ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎ.కోడూరు ఎస్ఐ డి.లక్ష్మీనారాయణను చీడికాడకు, చీడికాడ ఎస్ఐ బి.సతీష్ను కశింకోటకు బదిలీ చేశారు. కె.సంతోష్కుమార్ను అనకాపల్లి టౌన్ పోలీస్స్టేషన్ నుంచి ఎ.కోడూరుకు, పి.మనోజ్కుమార్ను కశింకోట నుంచి బుచ్చెయ్యపేటకు,ఎ.శ్రీనివాసరావును బుచ్చెయ్యపేట నుంచి ఇంటిలిజెన్స్ విభాగానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
హోంమంత్రి వద్ద పలుకుబడి ఉన్న
కొందరు పాయకరావుపేట నియోజకవర్గంలో తమకు ఎదురేలేదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇష్టానుసారం దందాలకు
పాల్పడతున్నారు. అందుకు తగ్గట్టుగా అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
ఎస్.రాయవరం మండలానికి చెందిన ఓ ఐటీడీపీ నాయకుడు గ్రావెల్ దోపిడీకి అడ్డేలేకుండా పోయింది. వందలాది ట్రాక్టర్లతో యథేచ్ఛగా తరలిస్తున్నా పట్టించుకునే నాథుడే లేకపోయాడు.
ప్రభుత్వ, జిరాయితీ భూముల్లో అక్రమ తవ్వకాలు


