ఏప్రిల్‌ 4 నుంచి రైల్వే క్రీడా సంబరాలు | - | Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌ 4 నుంచి రైల్వే క్రీడా సంబరాలు

Mar 20 2026 8:15 AM | Updated on Mar 20 2026 8:15 AM

విశాఖ స్పోర్ట్స్‌: వాల్తేరు రైల్వే అంతర విభాగాల క్రీడా పోటీలు ఏప్రిల్‌ 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. వివిధ విభాగాలకు చెందిన రైల్వే ఉద్యోగులు మొత్తం 12 క్రీడాంశాల్లో తలపడనున్నారు. తూర్పు కోస్తా రైల్వే క్రీడా సంఘం(వాల్తేరు) ఆధ్వర్యంలో ఈ పోటీలు ఏప్రిల్‌ 30 వరకు జరగనున్నాయి. పురుషులు, మహిళలకు వేర్వేరుగా టేబుల్‌ టెన్నిస్‌, టెన్నిస్‌, వెయిట్‌లిఫ్టింగ్‌, వాలీబాల్‌, బ్యాడ్మింటన్‌, చదరంగం, క్యారమ్స్‌, అథ్లెటిక్స్‌ పోటీలు నిర్వహించనున్నారు. పురుషుల విభాగంలో అదనంగా ఫుట్‌బాల్‌, బాడీబిల్డింగ్‌, బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలు జరగనున్నాయి. ఈ క్రీడల్లో అకౌంట్స్‌, వైద్య, ఆపరేటింగ్‌, ఇంజనీరింగ్‌, వాణిజ్య, విద్యుత్‌, మెకానికల్‌, పర్సనల్‌, నిర్మాణ, టెలికాం, డీఎల్‌ఎస్‌, ఓపీ, టీఆర్‌ఎస్‌, టీఆర్టీ, జనరల్‌, ఆర్పీఎఫ్‌, భద్రత, స్పోర్ట్స్‌ విభాగాలకు చెందిన 19 జట్లు పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా వాల్తేరు డీఆర్‌ఎం లలిత్‌ బోహ్రా గురువారం క్రీడా పోటీల పోస్టర్‌ను విడుదల చేశారు. ఏడీఆర్‌ఎంలు కె.రామారావు, క్రీడాధికారి ఎం.హరనాథ్‌, సహాయాధికారి దేవ్‌ సాహు, ఎన్‌.ఉష తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement