50 ఏళ్లకే పింఛను ఎప్పుడు..?
ఎన్నికల కాలంలో చంద్రబాబు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు 50 ఏళ్లకు సామాజిక పింఛన్లను ఇవ్వనున్నట్లు హామీని ఇచ్చారు. ప్రస్తుతం ఈ మూడో బడ్జెట్లో పింఛనుకు కేటాయించిన నిధులను చూస్తే కొత్త పింఛన్లు లేవని ప్రజలకు అర్థం అవుతుంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చి సుమారు 20 నెలలు దాటుతున్నా స్పౌజ్ పింఛన్లు మినహా ఏ ఒక్కరికి కొత్త పింఛను ఇవ్వలేదు. పింఛను నగదు కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ చంద్రబాబు ప్రభుత్వం ఎటువంటి భరోసా కల్పించలేదు.
– ఆదిరెడ్డి రామునాయుడు, మాజీ సర్పంచ్, దాలివలస, కె.కోటపాడు మండలం


