సైక్లింగ్తో మెరుగైన ఆరోగ్యం
పోర్ట్ ఆధ్వర్యంలో అవగాహన యాత్ర
సీతంపేట (విశాఖ): విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో ‘ఫిట్ ఇండియా సైక్లింగ్ డ్రైవ్’లో భాగంగా ఆదివారం పోర్ట్ స్టేడియంలో ‘సండే ఆన్ సైకిల్స్’కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల్లో ఆరోగ్యం, ఫిట్నెస్, చురుకై న జీవనశైలిని ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. కార్యక్రమంలో వీపీఏ ఉద్యోగులు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది, పాఠశాల విద్యార్థులు పాల్గొని తమ ఉత్సాహాన్ని చాటారు. ఐక్యత, క్రమశిక్షణ, ఆరోగ్యవంతమైన భారత నిర్మాణానికి ప్రతి ఒక్కరూ అంకితభావంతో కృషి చేయాలనే సందేశాన్ని ఇస్తూ ఈ కార్యక్రమం సాగింది.


