బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేయవద్దంటూ ధర్నా
అనకాపల్లి: మండలంలో తుమ్మపాల పంచాయతీ పరిధి గాయత్రీనగర్లో బార్ అండ్ రెస్టారెంట్ను ఏర్పాటు చేయవద్దంటూ గ్రామ మహిళలు శనివారం ధర్నా చేశారు. బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేయడానికి ఏర్పాటు చేసిన బోర్డు వద్ద వారు ఆందోళన చేశారు. బార్ ఓపెన్ చేస్తే ఎలాంటి ఉద్యమాలకై నా వెనకాడబోమని కాలనీ వాసులుహెచ్చరించారు. విషయం తెలుసుకున్న పట్టణ ఎస్ఐ శ్రీనివాసరావు తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని కాలనీవాసులతో మాట్లాడారు. బార్ యజమానిని పిలిచి మాట్లాడుతామని అంతవరకు ఆందోళన చేయవద్దంటూ నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.


