50 ఏళ్లకు పింఛన్...లేనట్టేనా..?
న్యూస్రీల్
శనివారం శ్రీ 21 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
వైఎస్సార్ సీపీ కమిటీల్లో పలువురికి చోటు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారికి 50 ఏళ్లకే సామాజిక పింఛన్ను ఇవ్వనున్నట్లు చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో చెప్పారు. దీంతో వారందరూ కూటమికి ఓట్లు వేశారు. అయితే అధికారంలోనికి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఆ ఊసే ఎత్తడం లేదు. 50 ఏళ్లు నిండిన అర్హులంతా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులు చూస్తే ఈ ఏడాది కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు పింఛన్లు మంజూరు చేసే పరిస్థితి లేదని అర్థమవుతోంది. చంద్రబాబు ప్రభుత్వం పేదలను మోసం చేసింది.
– సింగంపల్లి వెంకటరమణ, వి.సంతపాలెం గ్రామం, కె.కోటపాడు మండలం


