రూ.9.95 కోట్లతో వరాహ నది గట్టు పటిష్టత
కోతకు గురైన వరాహ నది గట్టును
పరిశీలిస్తున్న ఇరిగేషన్ అధికారులు
ఎస్.రాయవరం: వరాహ నది గట్టు పటిష్టతో పాటు గ్రోయిన్ దిగువన కాలువలకు నీరు ప్రవహించేలా నిర్మాణాలు పూర్తి చేయాలని ఇరిగేషన్ ఎస్ఈ పి.అప్పలనాయుడు సూచించారు. సోమిదేవపల్లి గ్రోయిన్ వద్ద గడిచిన 15 ఏళ్లుగా కోతకు గురైన వరాహ నది గట్టు నిర్మాణానికి రూ.9.95 కోట్లు విడుదల కావడంతో బుధవారం ఆయన పరిశీలించారు. వెంటనే పనులు ప్రారంభించాలని సూచించారు. ఈ పరిశీలనలో ఈఈ వి.బాలసూర్యం, డీఈఈ ఎం.వి.సురేష్కుమార్, ఏఈ అమీనాభాను, తదితరులు పాల్గొన్నారు.


