ధారమఠం హుండీ ఆదాయం లెక్కింపు
ధారమఠం శివాలయం వద్ద హుండీ ఆదాయం లెక్కిస్తున్న దృశ్యం
గొలుగొండ : ప్రముఖ శైవక్షేత్రమైన దారమఠం శివాలయం వద్ద మహా శివరాత్రి ఉత్సవాలు సందర్భంగా హుండీ, ఇతర ఆదాయం మొత్తం మూడు లక్షల 36 వేల ఆదాయం వచ్చిందని ఈవో టి. సాంబశివరావు తెలిపారు. ఈవో, దేవదాయ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం హుండీ ఆదాయం, టిక్కెట్లు, ఇతర ఆదాయాల లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. మొత్తం మూడు రోజులకు 3.36 లక్షల మేర ఆదాయం వచ్చిందని తెలిపారు. మూడు రోజుల పాటు శివరాత్రి ఉత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి దేవదాయశాఖ ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాతమల్లంపేట సర్పంచ్ ఆదిలక్ష్మి పాల్గొన్నారు.


