రాయి తరలిస్తున్న లారీల అడ్డగింత | - | Sakshi
Sakshi News home page

రాయి తరలిస్తున్న లారీల అడ్డగింత

Aug 6 2025 7:02 AM | Updated on Aug 6 2025 7:04 AM

దళిత రైతులు అడ్డుకోవడంతో నిలిచిపోయిన లారీలు

మాకవరపాలెం: నల్లరాయి తరలిస్తున్న లారీలను దళిత రైతులు అడ్డుకున్నారు. జి.కోడూరు రెవెన్యూలోని 332 సర్వే నంబర్‌లో నిర్వహిస్తున్న క్వారీ కారణంగా సమీపంలో ఉన్న భూములకు నష్టం వాటిల్లుతుందని, ఈ క్వారీ అనుమతులు రద్దు చేయాలని దళిత రైతులు గత 14 రోజులుగా నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి క్వారీ నుంచి రాయిని తరలిస్తున్న నాలుగు లారీలను వారు అడ్డుకున్నారు. తమకు నష్టం కలిగించే క్వారీ నిర్వహించేందుకు వీల్లేదని వారు స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement