
వాటర్ ప్లాంట్ నిర్వహణలో కక్షసాధింపు
● వైఎస్సార్సీపీ నాయకుడు బుజ్జి తొలగింపు
నర్సీపట్నం: ఎన్టీఆర్ సుజల స్రవంతి నిర్వహణ నుంచి వైఎస్సార్సీపీ నాయకుడు దాడి బుజ్జిని రాజకీయ కక్షసాధింపుతో తప్పించడం సరికాదని మున్సిపల్ వైస్ చైర్మన్లు కోనేటి రామకృష్ణ, తమరాన అప్పలనాయుడు, కౌన్సిలర్లు సిరసపల్లి నాని, మాకిరెడ్డి బుల్లిదొర, కోఆప్షన్ సభ్యుడు ఎండీ బాషా, పార్టీ నాయకులు చీటిల రాము, యాదగిరి శేషు తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ సురేంద్రకు సోమవారం వారు వినతిపత్రం అందజేశారు. 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వం కాపు వీధిలో ప్రారంభించిన ఈ ప్లాంట్ను నాటి నుంచి నేటి వరకు బుజ్జి తన సొంత నిధులతో నిర్వహిస్తూ ప్రజలకు సజావుగా నీటిని సరఫరా చేస్తున్నారన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదు లేకపోయినా టీడీపీ నాయకులు ఒత్తిడి మేరకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ప్లాంట్ నిర్వహణ బాధ్యతల నుంచి తొలగించటం సమంజసం కాదన్నారు. ప్లాంట్ నిర్వహణకు అవసరమైన ఎక్యూప్మెంట్కు రూ.2 లక్షలకు పైగా వెచ్చించారన్నారు. కనీసం ఆ నిధులైన ఇవ్వాలని వినతిపత్రంలో డిమాండ్ చేశారు.