ముంచేసిన అధిక వడ్డీ ఆశ | - | Sakshi
Sakshi News home page

ముంచేసిన అధిక వడ్డీ ఆశ

Jun 11 2025 8:44 AM | Updated on Jun 11 2025 8:44 AM

ముంచేసిన అధిక వడ్డీ ఆశ

ముంచేసిన అధిక వడ్డీ ఆశ

బుచ్చెయ్యపేట: అధిక వడ్డీ ఆశతో బుచ్చెయ్యపేట మండల యువకులు నిలువునా మోసపోయారు. తెలంగాణకు చెందిన కార్లను తెచ్చి తాకట్టు పెట్టి యువకుల వద్ద కోటి రూపాయలకు పైగా దోచుకున్నారు. ఈ మోసంలో బుచ్చెయ్యపేట మండలం దిబ్బిడికి చెందిన ఓ రాజకీయ కుటుంబం సుమారు రూ.80 లక్షక్షలు, నేతవానిపాలేనికి చెందిన ఒక యువకుడు రూ.20 లక్షలకు పైగా కోల్పోయినట్టు తెలుస్తోంది. మన్యం జిల్లా పార్వతీపురానికి చెందిన వ్యక్తి తెలంగాణ నుంచి కార్లను తీసుకొచ్చి వీరి వద్ద తాకట్టు పెట్టి డబ్బులు తీసుకెళ్లేవాడు. ఒక్కో కారు కుదువ పెట్టి మూడు, నాలుగు లక్షలు తీసుకునేవాడు. ఈ సొమ్ముపై లక్షకు నెలకు రూ.15 వేల వడ్డీ ఇచ్చేవాడు. అధిక వడ్డీకి ఆశపడిన వీరిద్దరూ తమ డబ్బులతోపాటు తమకు తెలిసిన వారి వద్ద నాలుగైదు రూపాయల వడ్డీకి డబ్బులు తెచ్చి మరీ కార్లు తాకట్టు పెట్టుకొని సొమ్ము ఇచ్చేవారు. అప్పు తిరిగి చెల్లించకపోయినా కార్లు తమ వద్దే ఉంటాయన్న ధీమాతో వారంతా కోటి రూపాయలకు పైగా ఇచ్చేశారు. నాలుగైదు రూపాయల వడ్డీకి అప్పు తెచ్చి, కార్లు తాకట్టు పెట్టుకొని 15 రూపాయల వడ్డీకి అప్పు ఇచ్చేవారు. నెలకు లక్ష వద్ద రూ.10 వేలు వడ్డీ మిగలడంతో వీరు లక్షలకు లక్షలు వెచ్చించారు.

కొసమెరుపు : పది రోజుల క్రితం తెలంగాణ పోలీసులు దిబ్బిడి వచ్చి యువకుల వద్ద తాకట్టు పెట్టిన కార్లను పట్టుకుపోయారు. వాటిని పార్వతీపురానికి చెందిన వ్యక్తి తమకు తాకట్టు పెట్టినట్టు వారు చెప్పినా పోలీసులు వినలేదు. తమ కార్లను లీజుకు తీసుకొని అప్పజెప్పలేదని తెలంగాణకు చెందిన కారు ఓనర్లు ఫిర్యాదు చేయడంతో, జీపీఎస్‌ ద్వారా ఇక్కడ కార్లు ఉన్నట్లు గుర్తించామని తెలంగాణ పోలీసులు వీరికి తెలిపారు. దొంగ కార్లను కొన్నందుకు మీపైనే కేసులు పెడతామని బెదిరించి 30 కార్లను పట్టుకుపోయారు. కార్లు తాకట్టు పెట్టిన పార్వతీపురానికి చెందిన వ్యక్తికి ఫోన్‌ చేయగా ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ రావడంతో మోసపోయామని వారికి అర్థమయింది. వారిద్దరికీ అప్పులిచ్చిన యువకులు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. గతంలో కూడా అనకాపల్లి మండలంలోని తుమ్మపాల గ్రామంలో కార్ల తాకట్టు పేరిట మోసం జరిగింది. బుచ్చెయ్యపేట మండలంలోని రాజాం, సీతయ్యపేట, చిట్టియ్యపాలెం తదితర గ్రామాల్లో కూడా ఇలాంటి మోసాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

రూ.కోటికి పైగా కుచ్చు టోపీ

కార్లు తాకట్టు పెట్టి రూ.15ల వడ్డీకి అప్పు తీసుకున్న మోసగాడు

రూ.కోటికి పైగా వెచ్చించిన బుచ్చెయ్యపేట యువకులు

తెలంగాణ పోలీసులు రావడంతో మోసం బట్టబయలు

అద్దెకు తీసుకున్న కార్లను తాకట్టుపెట్టినట్టు తెలుసుకొని లబోదిబో

30 కార్లను తీసుకుపోయిన తెలంగాణ పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement