
అప్పుల పాలయ్యాం.. మధ్యాహ్న భోజనం పెట్టలేం
దైవ దర్శనానికి వెళ్లి వస్తూ...
● రోడ్డు ప్రమాదంలో తల్లి మృతి...తండ్రికి సీరియస్ ● ఆర్.శివరాంపురంలో విషాదఛాయలు
–8లో
చోడవరం: మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు రావలసిన బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఏపీ మధ్యాహ్న భోజన పథకం రాష్ట్ర అధ్యక్షురా లు గూనూరు వరలక్ష్మి డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకుల సంఘం ముఖ్యనాయకుల సమావేశం చోడవరంలో బుధవారం జరిగింది. డిసెంబరు నెల నుంచి నేటి వరకూ మధ్యాహ్న భోజన పథకం బిల్లులు మంజూరు కాలేదని, అప్పులు చేసి విద్యార్థులకు భోజనం పెడుతున్నామని చెప్పారు. వడ్డీ లు కట్టుకోలేక చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామ న్నారు. ఐదు నెలలుగా బిల్లులు రాలేదని, పాఠశాలలు తెరిస్తే విద్యార్థులకు ఎలా భోజనం పెట్టగలమని ఆమె ప్రశ్నించారు.గత ప్రభుత్వ హయాంలో ప్రతి నెలా 15వ తేదీకి బిల్లులు వచ్చేవని, కూటమి ప్రభుత్వం వచ్చాక సకాలంలో ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ వేతనాలు కూడా సరిగా ఇవ్వడం లేదన్నారు. ఇదే ఉపాధిగా జీవిస్తున్న తాము జీతాలు రాక, బిల్లులు చెల్లించక ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయామని, అప్పులు తెచ్చి భోజనం పెట్టలేమని ఆమె చెప్పారు. వెంటనే ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని వరలక్ష్మి హెచ్చరించారు. ఆందోళనలో సంఘ ప్రతినిధులు ఎస్.అమ్మాజీ, బి.ఉమ, కె.నాగమణి, ఒ.దేముడమ్మ, ఆర్.బుచ్చిరాజమ్మ, ఎం.దేవి, వరలక్ష్మి, రాజులమ్మ, సత్యవతి పాల్గొన్నారు.
బకాయి పడ్డ బిల్లులు, జీతాలు వెంటనే విడుదల చేయాలి
మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకుల డిమాండ్