
రోడ్డున పడ్డ ఉద్యోగులు
కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో వలంటీర్లు, 108 ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ టీచర్లు, ఆశా కార్యకర్తల ధర్నాలు, నిరసనలతో విశాఖ హోరెత్తిపోతోంది. ప్రభుత్వమే వేతనాలు చెల్లించాలని 108 ఉద్యోగులు.. విధుల్లోకి తీసుకొని రూ.10 వేలు వేతనం ఇవ్వాలని వలంటీర్లు.. సమస్యలు పరిష్కరించాలంటూ ఆశ వర్కర్ల నిరసనలు.. ఆకలి కేకలతో అలమటిస్తూ పెండింగ్ జీతాల కోసం ఆయాల పొలికేకలు.. ఎండీయూ వాహనాలు రద్దు చేయడంతో రోడ్డున పడ్డ 702 మంది ఆపరేటర్లు, హెల్పర్ల ఆర్తనాదాలు.. ఇలా చంద్రబాబు ఏడాది పాలనలోనే అన్ని వర్గాల నుంచి అసహనం కట్టలు తెంచుకుంటోంది.